Mangoes: మామిడి తింటున్నారా.. హైదరాబాద్ లో విష మామిడి పళ్ళ తయారీ.. పైన నిగనిగ.. లోపల కాలకూట విషం..
- మామిడి పండ్ల సీజన్ మొదలైంది
- నిషేధిత రసాయనాలను ఉపయోగించి మామిడి కాయలను కృత్రిమంగా పండిస్తున్నారు
- హైదరాబాద్ లో విష మామిడి పళ్ళ తయారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి కాలం వచ్చేసింది. మామిడి పండ్ల సీజన్ మొదలైంది. రుచికరమైన, తీపి మామిడి పండ్లు అందరికీ ఇష్టం. కానీ హైదరాబాద్ మార్కెట్లలో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు కాల్షియం కార్బైడ్ (CaC₂) వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి మామిడి కాయలను కృత్రిమంగా పండిస్తున్నారు. ఇలాంటి పండ్లు బయట నుంచి నిగనిగలాడుతూ, ఆకర్షణీయంగా కనిపించినా, లోపల పచ్చిగా ఉండి ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తాయి.
Also Read:Mee Seva Shutdown: నేటి రాత్రి నుంచి మీ సేవా కేంద్రాలు బంద్.. ఎన్ని రోజులంటే..
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
- మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
- Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
- డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
హైదరాబాద్లోని ఆసిఫ్నగర్ ప్రాంతంలో ఉన్న ఫరీద్ ఫ్రూట్ షాప్ గోదాం పై హెచ్ ఫాస్ట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మామిడిపండ్లను “ఇథలీన్” (Ethylene) అనే రసాయనంతో కృత్రిమంగా మక్కపెడుతున్నారనే సమాచారంతో ఈ రైడ్ చేపట్టినట్లు హెచ్ ఫాస్ట్ సీఐ రంజిత్ తెలిపారు. దాడుల్లో మొత్తం సుమారు 7 టన్నుల మామిడిపండ్లు గుర్తించారు. ఈ పండ్లను బాటాసింగారం మార్కెట్ నుండి కొనుగోలు చేసి, గోదాంలో నిల్వ ఉంచి మార్కెట్కు సరఫరా చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ వ్యవహారంలో గోదాం నిర్వాహకులు జమీల్, ఫరీద్పై కేసు నమోదు చేసి, గోదామును సీజ్ చేశారు. దాడుల సమయంలో సుమారు 350 ట్రేలను పోలీసులు గుర్తించారు. ఒక్కో ట్రేలో దాదాపు 20 కిలోల పండ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీలోని మొగల్ పుర, లాల్ దర్వాజా ప్రాంతాలలో చార్మినార్ టాస్క్ ఫోర్స్ జోన్ పోలీసుల దాడులు నిర్వహించారు. ప్రమాదకరమైన కెమికల్స్ తో మామిడి పండ్లను మగ్గ పెడుతున్న గోదాములపై దాడులు చేసి టన్నులకొద్ది మామిడిపండ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
మామిడి కాయలను కేవలం 5 రోజుల్లోనే పండ్లు గా మారుస్తున్న నిర్వాహకులు.. ఇథనాల్ ను 10 కిలోల మామిడి కాయలు ఉండే ట్రే లో కేవలం 2 ఇథనాల్ ప్యాకెట్స్ ఉంచాలి. అది కూడా కాంటాక్ట్ లెస్ గా.. కానీ.. ఒక్కో ట్రే లో 7, 8 ఇథనాల్ ప్యాకెట్లు.. అది కూడా నేరుగా ఉంచుతున్నారు. ప్యాకెట్ నుంచి వెలువడే హానికర గ్యాస్ ద్వారా కేవలం మూడు రోజుల్లోనే కాయ పూర్తిగా మగ్గుతోంది. ఈ మామిడి పండ్లు తినడం ఆరోగ్యానికి హానికరం.. పిల్లలకు ప్రాణాంతకంగా మారుతోంది.
Also Read:Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..
కల్తీ మామిడిని ఎలా గుర్తించాలి
రంగు: సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు. ఆకుపచ్చ + పసుపు మిశ్రమం ఉంటుంది. కల్తీ పండు పైన ఏకరీతి పసుపు-పచ్చగా, లోపల పచ్చిగా ఉంటుంది.
వాసన: సహజ పండుకు తీపి, సువాసన ఉంటుంది. కల్తీ పండుకు వాసన తక్కువ లేదా రసాయన వాసన వస్తుంది.
నీటి పరీక్ష: ఒక బకెట్ నీటిలో వేయండి. సహజ పండు బరువుగా మునుగుతుంది. కల్తీ పండు తేలికగా తేలుతుంది.
ముట్టుకోవడం: కల్తీ పండ్లు త్వరగా మెత్తబడతాయి లేదా బ్లాక్ స్పాట్స్ వస్తాయి. చర్మం మీద బర్న్ లాంటి మచ్చలు కనిపించవచ్చు.
రుచి: లోపల తీపి తక్కువగా, పచ్చి రుచి ఉంటుంది.
తాజావార్తలు
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
-
Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
-
Saif Ali Khan: బట్టలు లేకుండా నటించమన్నారు… 20 ఏళ్ల తర్వాత సైఫ్ అలీ ఖాన్ షాకింగ్ కామెంట్స్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
Gautam Gambhir: టీమ్ ఇండియా వైఫల్యాలపై ఐదు ప్రశ్నలు.. కోచ్ సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందా..?
ట్రెండింగ్
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!