Site icon NTV Telugu

Railway Station: తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. విమానాశ్రయం తరహాలో అభివృద్ధి..

ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న నాంపల్లి స్టేషన్‌కు కేంద్ర ప్రభుత్వం మహర్దశ కల్పించనుంది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ కింద ఈ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో నాంపల్లి రైల్వే స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మార్చేయనున్నట్లు వెల్లడించారు. 2027 చివరి నాటికి ఈ స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో అత్యాధునిక హంగులతో సిద్ధం కానుంది. దీని కోసం తొలి దశలో రూ. 327 కోట్లను రైల్వే శాఖ కేటాయించింది.

Also Read:Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త ట్రైన్స్.. ఈ ప్రాంతాల మధ్యే..

ప్రయాణికులు రైల్వే స్టేషన్ నుంచి నాంపల్లి మెట్రో స్టేషన్‌కు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా వెళ్లేందుకు వీలుగా అత్యాధునిక స్కై వాక్ నిర్మిస్తున్నారు. విలాసవంతమైన వెయిటింగ్ లాంజ్‌లు, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆటస్థలాలు , విశాలమైన మల్టీ-లెవల్ పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. స్టేషన్ యొక్క చారిత్రక నిర్మాణ శైలిని దెబ్బతీయకుండానే లోపలి భాగాలను డిజిటలైజ్ చేయనున్నారు.

Also Read:Modi-Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు మోడీ ఫోన్.. యుద్ధంపై సంభాషణ

ఇదిలా ఉండగా.. విశాఖపట్నం మరియు హైదరాబాద్ నుంచి కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను పట్టాలెక్కించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేరళ వైపు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఊరటనిస్తుంది. ఇది ప్రతి మంగళవారం ఉదయం 8:20 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా రాజమండ్రి-విశాఖ మార్గంలో కొన్ని రైళ్లను (07524, 17267, 17268, 07523) ఈ నెల 9వ తేదీ వరకు తాత్కాలికంగా రద్దు చేశారు. అయితే వీరికి ప్రత్యామ్నాయంగా కాకినాడ – విజయవాడ – గుంటూరు మధ్య 16 చైర్ కార్ కోచ్‌లతో కూడిన ప్రత్యేక సర్వీసులను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.

Exit mobile version