అక్కినేని నాగచైతన్య గత ఏడాది కాలంగా ‘వృషకర్మ’ ప్రాజెక్ట్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ సినిమా కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక మిస్టరీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్తో సాగే ఈ కథలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్న ఈ సినిమాకు అజనీష్ లోక్ నాథ్ సంగీతం ప్రధాన బలం కానుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో, చిత్ర యూనిట్ ఒక అత్యంత కీలకమైన షెడ్యూల్ కోసం రాజస్థాన్ వెళ్తోంది.
Also Read : Mani Sharma : నా ‘హార్మొనీ’ దుమ్ము పట్టిపోయింది.. మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్!
తీవ్రమైన ఎండలను కూడా లెక్కచేయకుండా, అక్కడ ఒక ఇంపార్టెంట్ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్లో నాగచైతన్యతో పాటు ఇతర ముఖ్య తారాగణం పాల్గొననున్నారు. మే చివరి నాటికి మొత్తం షూటింగ్ను పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నాగచైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాపై.. అప్పుడే బిజినెస్ కూడా భారీ ధరలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.కాగా అన్ని పనులను సకాలంలో పూర్తి చేసి, ఈ ఏడాది దసరా (అక్టోబర్ 2026) కానుకగా సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చిత్ర బృందం గట్టి పట్టుదలతో ఉంది.
