Yogi Adhityanath: సీఎం యోగిని చంపేస్తానని బెదిరించిన ముస్లిం మహిళ.. విచారణలో సంచలన విషయాలు

  • సీఎం యోగికి బెదిరింపు
  • చంపేస్తామంటూ.. ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌లో మెసేజ్
  • సందేశం పంపిన మహిళలను గుర్తించిన పోలీసులు
  • ఆమె మానసిక పరిస్థితి సరిగ్గాలేదని వెల్లడి
Yogi Adityanath

Yogi Adityanath

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను చంపుతామని బెదిరించిన ఓ మహిళను పోలీసులు, ఏటీఎస్‌లు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ మానసికంగా బలహీనురాలు అని పోలీసులు చెబుతున్నారు. యోగి 10 రోజుల్లో రాజీనామా చేయకుంటే బాబా సిద్ధిఖీలా చంపేస్తామని నిందితురాలు ముంబయి పోలీస్ కంట్రోల్ రూమ్‌లో మెసేజ్ చేసింది. యూపీ సీఎంకు బెదిరింపు సందేశం రావడంతో మహారాష్ట్ర ఏటీఎస్, థానే పోలీసులు, ముంబైలోని వర్లీ పోలీసులు విచారణలో నిమగ్నమయ్యారు. మహిళ థానేలోని ఉల్హాస్‌నగర్‌లో నివాసముంటున్నట్లు సంయుక్త విచారణలో తేలింది. ఆమె పేరు ఫాతిమా ఖాన్. విచారణలో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఫాతిమా మానసికంగా అస్థిరంగా ఉందని పోలీసులు తెలిపారు.

READ MORE: J-K: జమ్మూకశ్మీర్‌లో మరో ఉగ్రదాడి..

యోగికి బెదిరింపు రావడంతో ఏటీఎస్‌కు ఈ విషయం తెలిసింది. చాలా మంది మహిళలను ఏటీఎస్ విచారించింది. చివరికి ఆమె జాడను కనుగొన్న ఏటీఎస్ పోలీసులు.. మహిళ ఇంటికి చేరుకుని అక్కడ ఆమెను విచారించారు. అనంతరం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి అక్కడ కూడా విచారణ జరిపారు. అనంతరం వర్లీ పోలీసులకు సమాచారం అందించారు. అప్పుడు వర్లీ పోలీసులు ముంబయికి వచ్చారు. అయితే మహిళను అరెస్టు చేయలేదు. ఈ విషయాన్ని ముంబైకి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ధృవీకరించారు. విచారణ అనంతరం ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఆమె మానసిక పరిస్థితిని తెలుసుకునేందుకు మెడికల్ చెకప్ చేయిస్తున్నారు.

READ MORE:Venky Atluri: హను రాఘవపూడి, నాగ్ అశ్విన్ లకు ఆడిషన్ ఇచ్చా.. షాకింగ్ విషయం బయటపెట్టిన స్టార్ డైరెక్టర్