Mukhesh Ambani : బడ్జెట్కు 35 నిమిషాల ముందు రూ.19వేల కోట్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukhesh Ambani : బడ్జెట్ ప్రకటనకు ముందు దేశంలోని అతిపెద్ద కంపెనీల షేర్లు పతనం ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ప్రకటనకు ముందే ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.19,000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. సెన్సెక్స్ వరుసగా రెండో రోజు పతనమవుతోంది. కంపెనీ షేర్లు రూ.3000 దిగువన ట్రేడవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు సోమవారం లాగా భారీ పతనాన్ని చూడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఒకరోజు క్రితం రిలయన్స్ షేర్లు మూడున్నర శాతం పతనంతో ముగియగా, కంపెనీ వాల్యుయేషన్ రూ.73 వేల కోట్లకు పైగా క్షీణించింది.
Read Also:IAS Smita Sabharwal: మాజీ ఐఏఎస్ బాలలతకు సెటైర్ వేసిన స్మితా..
Also Read
- Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
- NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
- Tokyo: టోక్యోలో తప్పిన విమాన ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా ఏం జరిగిందంటే..!
బడ్జెట్కు కొద్ది నిమిషాల ముందు, స్టాక్ మార్కెట్లో దేశంలోని అతిపెద్ద కంపెనీ షేర్లలో క్షీణత ఉంది. కంపెనీ షేర్లు 0.90 శాతం అంటే రూ.26.85 పతనంతో రూ.2975.20 వద్ద ట్రేడవుతున్నాయి. ట్రేడింగ్ సెషన్లో కంపెనీ షేర్లు కూడా రోజు దిగువ స్థాయి రూ.2,973కి చేరాయి. అయితే, కంపెనీ షేర్లు ఉదయం రూ.3004.95తో సానుకూల ఫ్లాట్ నోట్తో ప్రారంభమయ్యాయి. ఒకరోజు క్రితం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో 3.50 శాతం క్షీణత కనిపించింది. ఆ తర్వాత కంపెనీ షేర్లు రూ.3001.10 వద్ద ముగిశాయి.
Read Also:Budget 2024 : బడ్జెట్ టాబ్లెట్తో కెమెరాలకు ఫోజులిచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఇక కంపెనీ వాల్యుయేషన్ పరంగా బడ్జెట్ ప్రారంభానికి 35 నిమిషాల ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.19 వేల కోట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది. ఒకరోజు క్రితం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ విలువ రూ.20,30,488.32 కోట్లు. జూలై 23న కంపెనీ షేర్లు రోజు కనిష్ట స్థాయి రూ.2,973కి చేరుకోగా, కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.20,11,476.38 కోట్లకు చేరుకుంది. అంటే బడ్జెట్కు 35 నిమిషాల ముందు కంపెనీ వాల్యుయేషన్ రూ.19,011.94 కోట్ల నష్టాన్ని చవిచూసింది. మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన లక్షల మంది పెట్టుబడిదారులు వరుసగా రెండో రోజు కూడా భారీ నష్టాలను చవిచూశారు. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక ఇన్వెస్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన 10 వేల షేర్లను కలిగి ఉంటే, ఒక్కో షేరుకు రూ.28.1 పతనంతో రూ.2.81 లక్షల నష్టం వచ్చింది. ఇది చిన్న నష్టం అని చెప్పలేం. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో పెద్ద క్షీణత కనిపించవచ్చని నిపుణుల అభిప్రాయం పడుతున్నారు.
తాజావార్తలు
-
Weather News: ఆస్ట్రేలియా నుంచి గుడ్న్యూస్..ఇండియాలో వర్షాలు..!
-
Hardeep Singh Puri: పెట్రోల్-డీజిల్ ధరలపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. రూ.12 లక్షల కోట్ల సంపద ఆవిరి
-
Peddi: బుచ్చిబాబు మాస్టర్ ప్లాన్.. ‘పెద్ది’ ట్రైలర్ తర్వాత ఫ్యాన్స్కు ఇచ్చే గిఫ్ట్ ఇదే!
-
NEET Paper Leak: రూ. 30 వేలకే నీట్ పేపర్?.. లీక్లో కోచింగ్ సెంటర్లు, హాస్టళ్ల ప్రమేయం..
ట్రెండింగ్
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!