MLA Attacked by Locals: ఏనుగుదాడిలో మహిళ మృతి.. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను తరిమికొట్టిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Attacked by Locals: ఏనుగు దాడిలో మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు చితక్కొట్టారు. పరామర్శకు వస్తే ఎందుకు కొట్టారు అనుకుంటున్నారా..?. అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఏనుగు దాడిలో ఓ మహిళ చనిపోయింది. ఈ నేపథ్యంలో తమ ప్రాంతంలో తరచూ ఏనుగుల బారిన పడి ప్రజలు చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మృతదేహంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామి ఆదివారం సాయంత్రం అక్కడకు వెళ్లారు.
ఆ సమయంలో గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదిలా ఉండగా.. తాము మృతదేహంతో ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే తీరిగ్గా సాయంత్రం వస్తారా అంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు మండిపడ్డారు. ఎమ్మెల్యే కూడా అంతే తీవ్రంగా బదులివ్వడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన జనం ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊరు నుంచి తరిమి తరిమి కొట్టారు. ఈ లోగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను కాపాడి అక్కడి నుంచి తరలించారు. చనిపోయిన మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే గ్రామస్తులు దాడి చేశారంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే చొక్కా చినిగిపోవడం గమనార్హం.
Also Read
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
Mangaluru Auto Blast: మంగళూరు ఆటో పేలుడు కేసులో పురోగతి.. నిందితుడికి ఐసిస్తో సంబంధాలు
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఓ మహిళ తన భర్తతో కలిసి ఆదివారం తెల్లవారుజామున పశువులకు మేత కోయడానికి పొలానికి వెళ్లారు. ఒక్కసారిగా ఏనుగు ఇద్దరిపై దాడికి యత్నించగా భార్యాభర్తలు పరుగులు తీశారు. భార్యను వెంబండించిన ఏనుగు తొక్కి చంపేసింది. తన కళ్ల ముందే భార్య ప్రాణాలు కోల్పోవడంతో భర్త తీవ్రంగా విలపించాడు.
Shobha (45) of #Hullemane village near #Kundur, #Mudigere taluk, died on Sunday morning due to elephant attack. It has been alleged that #BJP MLA #MPKumaraswamy who came late to the spot was beaten up and his clothes torn apart.#Karnataka #Chikkamagaluru #BJPGovt #BJPMLA pic.twitter.com/KPmRlcB53a
— Hate Detector 🔍 (@HateDetectors) November 20, 2022
తాజావార్తలు
-
Jos Buttler: నెహ్రా నిర్ణయంతో షాకైన జోస్ బట్లర్.. గుజరాత్ ఫైనల్ ఓటమి వెనుక అసలు కథ ఇదే!
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
-
Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!