MLA Attacked by Locals: ఏనుగుదాడిలో మహిళ మృతి.. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను తరిమికొట్టిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Attacked by Locals: ఏనుగు దాడిలో మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు చితక్కొట్టారు. పరామర్శకు వస్తే ఎందుకు కొట్టారు అనుకుంటున్నారా..?. అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఏనుగు దాడిలో ఓ మహిళ చనిపోయింది. ఈ నేపథ్యంలో తమ ప్రాంతంలో తరచూ ఏనుగుల బారిన పడి ప్రజలు చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మృతదేహంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామి ఆదివారం సాయంత్రం అక్కడకు వెళ్లారు.
ఆ సమయంలో గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదిలా ఉండగా.. తాము మృతదేహంతో ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే తీరిగ్గా సాయంత్రం వస్తారా అంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు మండిపడ్డారు. ఎమ్మెల్యే కూడా అంతే తీవ్రంగా బదులివ్వడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన జనం ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊరు నుంచి తరిమి తరిమి కొట్టారు. ఈ లోగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను కాపాడి అక్కడి నుంచి తరలించారు. చనిపోయిన మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే గ్రామస్తులు దాడి చేశారంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే చొక్కా చినిగిపోవడం గమనార్హం.
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
Mangaluru Auto Blast: మంగళూరు ఆటో పేలుడు కేసులో పురోగతి.. నిందితుడికి ఐసిస్తో సంబంధాలు
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఓ మహిళ తన భర్తతో కలిసి ఆదివారం తెల్లవారుజామున పశువులకు మేత కోయడానికి పొలానికి వెళ్లారు. ఒక్కసారిగా ఏనుగు ఇద్దరిపై దాడికి యత్నించగా భార్యాభర్తలు పరుగులు తీశారు. భార్యను వెంబండించిన ఏనుగు తొక్కి చంపేసింది. తన కళ్ల ముందే భార్య ప్రాణాలు కోల్పోవడంతో భర్త తీవ్రంగా విలపించాడు.
Shobha (45) of #Hullemane village near #Kundur, #Mudigere taluk, died on Sunday morning due to elephant attack. It has been alleged that #BJP MLA #MPKumaraswamy who came late to the spot was beaten up and his clothes torn apart.#Karnataka #Chikkamagaluru #BJPGovt #BJPMLA pic.twitter.com/KPmRlcB53a
— Hate Detector 🔍 (@HateDetectors) November 20, 2022
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!