MLA Attacked by Locals: ఏనుగుదాడిలో మహిళ మృతి.. పరామర్శకు వచ్చిన ఎమ్మెల్యేను తరిమికొట్టిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Attacked by Locals: ఏనుగు దాడిలో మృతి చెందిన మహిళ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు చితక్కొట్టారు. పరామర్శకు వస్తే ఎందుకు కొట్టారు అనుకుంటున్నారా..?. అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఏనుగు దాడిలో ఓ మహిళ చనిపోయింది. ఈ నేపథ్యంలో తమ ప్రాంతంలో తరచూ ఏనుగుల బారిన పడి ప్రజలు చనిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మృతదేహంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామి ఆదివారం సాయంత్రం అక్కడకు వెళ్లారు.
ఆ సమయంలో గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదిలా ఉండగా.. తాము మృతదేహంతో ఉదయం నుంచి ఆందోళన చేస్తుంటే తీరిగ్గా సాయంత్రం వస్తారా అంటూ ఎమ్మెల్యేపై గ్రామస్తులు మండిపడ్డారు. ఎమ్మెల్యే కూడా అంతే తీవ్రంగా బదులివ్వడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రెచ్చిపోయిన జనం ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊరు నుంచి తరిమి తరిమి కొట్టారు. ఈ లోగా అక్కడికి చేరుకున్న పోలీసులు ఎమ్మెల్యేను కాపాడి అక్కడి నుంచి తరలించారు. చనిపోయిన మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే గ్రామస్తులు దాడి చేశారంటూ ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే చొక్కా చినిగిపోవడం గమనార్హం.
Also Read
- Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
- PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
- New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
- Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
Mangaluru Auto Blast: మంగళూరు ఆటో పేలుడు కేసులో పురోగతి.. నిందితుడికి ఐసిస్తో సంబంధాలు
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా హల్లేమనె కుందూరులో ఓ మహిళ తన భర్తతో కలిసి ఆదివారం తెల్లవారుజామున పశువులకు మేత కోయడానికి పొలానికి వెళ్లారు. ఒక్కసారిగా ఏనుగు ఇద్దరిపై దాడికి యత్నించగా భార్యాభర్తలు పరుగులు తీశారు. భార్యను వెంబండించిన ఏనుగు తొక్కి చంపేసింది. తన కళ్ల ముందే భార్య ప్రాణాలు కోల్పోవడంతో భర్త తీవ్రంగా విలపించాడు.
Shobha (45) of #Hullemane village near #Kundur, #Mudigere taluk, died on Sunday morning due to elephant attack. It has been alleged that #BJP MLA #MPKumaraswamy who came late to the spot was beaten up and his clothes torn apart.#Karnataka #Chikkamagaluru #BJPGovt #BJPMLA pic.twitter.com/KPmRlcB53a
— Hate Detector 🔍 (@HateDetectors) November 20, 2022
తాజావార్తలు
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..