MS Dhoni : ధోని అరుదైన రికార్డ్.. ఆ సిక్సర్ పడిన చోటునే విక్టరీ మెమోరియల్గా మార్చిన ఎంసీఎ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన మహేంద్ర సింగ్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్( ఎంసీఎ ) ధోనిని సగర్వంగా సత్కరించింది. 2011లో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో భారత్ ఆడిన ఫైనల్స్ లో ధోని విన్సింగ్ షాట్ కొట్టిన విషయం అందరికి తెలిసిందే.. నువాన్ కులశేఖర్ బౌలింగ్ లో లాంగాన్ మీదుగా ఎంఎస్ ధోని సిక్సర్ కొట్టగా.. ఆ బంతి పడ్డ చోటును ఎంసీఎ.. 2011 వరల్డ్ కప్ విక్టరీ మెమోరియల్ గా మార్చింది. సరిగ్గా ఆ బంతి పడ్డ చోటును వరల్డ్ కప్ విక్టరీ మెమోరియల్ గా మార్చి ఎంసీఎ.. ధోనితోనే దానిని ప్రారంభించింది. ముంబై ఇండియన్స్ తో ఐపీఎల్ -16లో మ్యాచ్ ఆడేందుకు వాంఖెడ్ కు వచ్చిన ధోనితో ఎంసీఎ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ధోని కొట్టిన బంతి పడ్డ చోటును అలంకరించి అతడితోనే ఓపెనింగ్ చేయించింది. ముంబై-చెన్నై మధ్య ఇవాళ రాత్రి జరుగనున్న ఎల్ క్లాసికో మ్యాచ్ కు ముందు ధోనితో ఈ వరల్డ్ కప్ విక్టరీ మెమోరియల్ ను ప్రారంభించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2011 ఏప్రిల్ 2న భారత జట్టు.. తమ రెండో వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుని 12 ఏండ్లు పూర్తైన సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వహించింది.
On This Day in 2011 – India won ODI WC trophy, IND beat SL in final – One of the Greatest moment in Indian sports history.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
"Dhoni finishes off in style, it's magnificent strike into crowd, India lift the World Cup after 28 years" – ICONIC, UNBELIEVABLE. pic.twitter.com/kwpto5NZQR
— Tanuj (@ImTanujSingh) April 1, 2023
Also Read : IPL2023 : సీఎస్కే మ్యాచ్ తో మ్యాచ్.. సచిన్ తనయుడు అరంగేట్రం నేడే..!
క్వార్టర్స్ లో ఆస్ట్రేలియాను, సెమీస్ లో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ కు చేరిన టీమిండియా.. ఫైనల్ లో లంకతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ జట్టులో మహేళ జయవర్దెనే ( 103) సెంచరీ చేయగా.. తిలకర్నతే దిల్షాన్ ( 48), నువాన్ కులశేఖర్ ( 32)తో రాణించారు. 275 పరుగుల లక్ష్యంతతో బరిలోకి దిగిన భారత జట్టు 31 పరుగులకే ఓపెనర్లిద్దరు అవుట్ అయిపోయారు. వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్ అవగా టోర్నీ ఆసాంతం రాణించిన సచిన్ టెండూల్కర్ ( 18) కూడా విఫలమయ్యాడు. అప్పుడే కొత్తగా టీమ్ లోకి వస్తున్న విరాట్ కోహ్లీ ( 35) తో కలిసి గౌతం గంభీర్ ( 97) భారత ఇన్సింగ్స్ ను కుదటపరిచాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 83 పరుగులు జోడించారు. కానీ కోహ్లీని దిల్షాన్ ఔట్ చేశాడు. కోహ్లీ నిష్క్రమణ తర్వాత వాస్తవానికి ఐదో స్థానంలో యువరాజ్ బ్యాటింగ్ కు రావాలి.. కానీ అలా కాకుండా టీమిండియా సారథి అయిన ఎంఎస్ ధోని క్రీజులోకి వచ్చాడు. గౌతం గంభీర్ తో కలిసి ఒక్కో పరుగుల కూడదీసుకుంటూ భారత్ ను విజయం వైపునకు నడిపించాడు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 109 పరుగుల భాగస్వామ్యం జోడించారు. గంభీర్ ను పెరీరా ఔట్ చేసినా అప్పటికే భారత విజయానికి చేరువలో ఉంది. చివర్లో యువరాజ్ ( 21 నాటౌట్ ) తో కలిసి ధోని 91 పరుగులతో నాటౌట్ గా నిలవడమే కాకుండా భారత్ కు వన్డే వరల్డ్ కప్ అందించాడు.
Also Read : Bearded Woman : బామ్మా మజాకా ! నీ గడ్డం మీసం అదుర్స్
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!