టాలీవుడ్ లో ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ హవా సాగుతుంది. తెలుగులో ఈ భామ చేసింది కేవలం మూడు సినిమాలే అయినా కానీ ప్రేక్షకులలో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో కబీర్ సింగ్ మరియు సూపర్ ౩౦ వంటి సినిమాలలో నటించి మెప్పించిన మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతా రామం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది
హనురాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం మూవీ అద్భుత విజయమా సాధించింది. సీతారామం సినిమాలో తన అందంతో అద్భుతమైన నటనతో మృణాల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత తెలుగులో మృణాల్ నటించిన రెండవ మూవీ హాయ్ నాన్న.నాని హీరోగా వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.హాయ్ నాన్న సినిమాతో మృణాల్ తెలుగులో మరో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో మృణాల్ నానితో పోటీ పడుతూ నటించింది.
తాజాగా ఈ భామ ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది .విజయదేవరకొండ హీరోగా నటించిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.ఇదిలా ఉంటే తాజాగా మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూ లో తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ లో తల్లితండ్రుల కారణంగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది అంటూ మృణాల్ తెలిపింది.నా తల్లితండ్రులకు నేను ఇంటిమేట్ సీన్స్ లో నటించడం ఇష్టం ఉండేది కాదని, అందువల్ల కొన్ని బిగ్ సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపింది. ఆ తర్వాత నేను కథ డిమాండ్ చేస్తే అలాంటి సీన్స్ చేయడం అత్యవసరం అని తల్లితండ్రులకు అర్థం అయ్యేలా చెప్పి సినిమాలను చేస్తున్నట్లుగా మృణాల్ తెలిపింది.ప్రస్తుతం మృణాల్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి .