MP Ranjith Reddy : చిలుకూరు బాలాజీ నుంచి ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల క్యాంపెయిన్ షురూ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఎంతోగానో ప్రాచుర్యం పొందిన చిలుకూరు బాలాజీ దేవస్థానం నుంచి చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి.రంజిత్ రెడ్డి తన ఎన్నికల క్యాంపెయిన్ను మంగళవారం(ఏప్రిల్ 9వ తేదీ నుంచి) షురూ చేశారు. తమ ఇంటి దేవుడు(ఇలవేల్పు) శ్రీ వెంకటేశ్వరుడికి కుటుంబ సభ్యులతో సంయుక్తంగా చిలుకూరులో పూజలు నిర్వహించిన తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 45 రోజుల పాటు ఆయన చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియెజకవర్గాల్లో అన్ని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా పర్యటన చేయనున్నారు. ఈ ప్రచారంలో ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంఛార్జీలు, ఆయన కుటుంబీకులు సైతం పాల్గొననున్నారు.
చిలుకూరి బాలాజీ పూజా కార్యక్రమంలో సతీమణి, టీటీడీ బోర్డు మెంబర్ గడ్డం సీతా రంజిత్ రెడ్డి, కుమార్తె అల్లుడు పూజా ఆకాంక్ష రెడ్డి, టీ రాజేశ్ రెడ్డి, కుమారుడు రాజ్ ఆర్యన్ రెడ్డి తదితర కుటుంబ సభ్యులు పాల్గొననున్నారు. కాగా, ఆయన వేరే ఏ నాయకుడిలాగా హైదరాబాద్ నగరానికే పరిమితం కాకుండా తన నియోజకవర్గమైన చేవెళ్ళలోని మొయినాబాద్ మండలం యెంకపల్లిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!