MP: పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 10 కి.మీ మేర వ్యాపించిన పొగలు
- మధ్యప్రదేశ్ లో భారీ అగ్రిప్రమాదం
- పీవీసీ పైపుల ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు
- 12ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న బృందాలు
- 10కిమీ మేర వ్యాపించిన పొగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP: మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం ఏడు గంటలకు మంటలు చెలరేగగా, అప్పటి నుంచి అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పైపుల ఫ్యాక్టరీలో ప్రమాదం జరుగడంతో మంటల తీవ్రత ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో పైపులను ఉంచడంతో వాటికి అంటుకుని మంటలు భీకర రూపం దాల్చాయి. 10 కిలోమీటర్ల దూరం వరకు పొగలు కనపడడాన్ని బట్టి మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయో అంచనా వేయవచ్చు. 12కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతోపాటు ఇసుక, నురగతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఫ్యాక్టరీలో ఉద్యోగులు లేరు
సిగ్నెట్ పీవీసీ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడి ఉద్యోగుల షిఫ్ట్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. దీంతో ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అందువల్ల ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేరు.
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
ఇసుకతో కూడా మంటలను ఆర్పే ప్రయత్నం
మూడు పోలీసు స్టేషన్ల పోలీసు బలగాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ధార్, పితంపూర్, ఇండోర్, బద్నావర్ నుండి ఫైర్ ఇంజన్లను పిలిపించారు. కానీ, పెద్దఎత్తున మంటలను అదుపు చేయలేకపోయారు. ఎయిర్పోర్ట్ అథారిటీకి చెందిన అగ్నిమాపక దళం కూడా మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉంది. అనంతరం ఇసుకతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం డంపర్ల నుంచి ఇసుకను తెప్పించారు.
Read Also:Chiranjeevi : చంద్రబాబు ప్రమాణ స్వీకారనికి మెగాస్టార్ కు ప్రత్యేక ఆహ్వానం..
పైపులు బయటకు తీస్తున్నారు
ఫ్యాక్టరీ లోపల ఉంచిన ప్లాస్టిక్ పైపులను వ్యవసాయానికి వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పైపులను బయటకు తీస్తున్నారు. దాని వల్ల మంటలు మరింత వ్యాపించకుండా జాగ్రత్త పడుతున్నారు.
స్పందించిన మంత్రి కైలాష్
మంత్రి కైలాష్ విజయవర్గియా ధార్ జిల్లాలోని పితాంపూర్లోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగిందని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఇండోర్ నుంచి ఐదు ఫోమ్లు నింపిన వాహనాలు, వాటర్ ట్యాంకర్లను పంపించారు. అవసరమైతే మరింత సహాయం అందిస్తామన్నారు. ప్రభుత్వం, పరిపాలన అలర్ట్ గా ఉన్నాయన్నారు.
Read Also:Balmoori Venkat: తప్పుడు ప్రచారాలు చేయకండి.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్..
తాజావార్తలు
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
-
Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘హిందూ గ్రోత్ రేట్’ అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!