MP: పైపుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 10 కి.మీ మేర వ్యాపించిన పొగలు
- మధ్యప్రదేశ్ లో భారీ అగ్రిప్రమాదం
- పీవీసీ పైపుల ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు
- 12ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న బృందాలు
- 10కిమీ మేర వ్యాపించిన పొగ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP: మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం ఏడు గంటలకు మంటలు చెలరేగగా, అప్పటి నుంచి అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పైపుల ఫ్యాక్టరీలో ప్రమాదం జరుగడంతో మంటల తీవ్రత ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో పైపులను ఉంచడంతో వాటికి అంటుకుని మంటలు భీకర రూపం దాల్చాయి. 10 కిలోమీటర్ల దూరం వరకు పొగలు కనపడడాన్ని బట్టి మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయో అంచనా వేయవచ్చు. 12కి పైగా ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతోపాటు ఇసుక, నురగతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఫ్యాక్టరీలో ఉద్యోగులు లేరు
సిగ్నెట్ పీవీసీ ఫ్యాక్టరీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడి ఉద్యోగుల షిఫ్ట్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది. దీంతో ఉదయం ఏడు గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అందువల్ల ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేరు.
Also Read
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
ఇసుకతో కూడా మంటలను ఆర్పే ప్రయత్నం
మూడు పోలీసు స్టేషన్ల పోలీసు బలగాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ధార్, పితంపూర్, ఇండోర్, బద్నావర్ నుండి ఫైర్ ఇంజన్లను పిలిపించారు. కానీ, పెద్దఎత్తున మంటలను అదుపు చేయలేకపోయారు. ఎయిర్పోర్ట్ అథారిటీకి చెందిన అగ్నిమాపక దళం కూడా మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉంది. అనంతరం ఇసుకతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం డంపర్ల నుంచి ఇసుకను తెప్పించారు.
Read Also:Chiranjeevi : చంద్రబాబు ప్రమాణ స్వీకారనికి మెగాస్టార్ కు ప్రత్యేక ఆహ్వానం..
పైపులు బయటకు తీస్తున్నారు
ఫ్యాక్టరీ లోపల ఉంచిన ప్లాస్టిక్ పైపులను వ్యవసాయానికి వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పైపులను బయటకు తీస్తున్నారు. దాని వల్ల మంటలు మరింత వ్యాపించకుండా జాగ్రత్త పడుతున్నారు.
స్పందించిన మంత్రి కైలాష్
మంత్రి కైలాష్ విజయవర్గియా ధార్ జిల్లాలోని పితాంపూర్లోని ఓ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగిందని ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఇండోర్ నుంచి ఐదు ఫోమ్లు నింపిన వాహనాలు, వాటర్ ట్యాంకర్లను పంపించారు. అవసరమైతే మరింత సహాయం అందిస్తామన్నారు. ప్రభుత్వం, పరిపాలన అలర్ట్ గా ఉన్నాయన్నారు.
Read Also:Balmoori Venkat: తప్పుడు ప్రచారాలు చేయకండి.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్..
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?