MP Margani Bharat Ram: బాబు ‘కోవర్టు ఆపరేషన్’ స్టార్ట్..! పవన్ మేల్కొంటే మంచిది..!
MP Margani Bharat Ram: టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి మార్గాని భరత్ రామ్.. వెన్నపోట్లు పొడవడం తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అలవాటేనని.. ఈ 2024 ఎన్నికలలో పవన్ కల్యాణ్ దొరికేసినట్లేనని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు వెన్నుపోటు పోడవడం వెన్నతో పెట్టిన విద్యే అన్నారు. అధికారంలో ఉన్న పార్టీలోకి తమ మనుషులను పంపి రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీలోకి టీడీపీ ఎంపీలు వెళ్లడం చంద్రబాబు డైరెక్షనే అని ఆరోపించారు. ప్రస్తుతం 2024 ఎన్నికలకు టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు ట్రాప్ లో కచ్చితంగా పవన్ పడతారని జోస్యం చెప్పారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
ఇక, టిక్కెట్లు కోసం టీడీపీ వాళ్లనే చంద్రబాబు.. జనసేనలోకి పంపి.. గెలిచిన తర్వాత టీడీపీలోకి రప్పించుకోవడం ఖాయం అన్నారు ఎంపీ భరత్.. అంటే ‘కోవర్టు ఆపరేషన్’ స్టార్ట్ అయిందని.. ఎన్నికల ఫలితాల అనంతరం అసలు రహస్యం, చంద్రబాబు మోసాన్ని జనసేనాని పవన్ గ్రహించేసరికి పుణ్యకాలం ముగిసిపోతుందని అన్నారు. చంద్రబాబు రాజకీయ జిమ్మిక్కులు గత మూడు దశాబ్దాలకు పైగా ఈ రాష్ట్ర ప్రజలు చూసి చూసి విసుగెత్తిపోయారన్నారు. ఇక చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించే పరిస్థితుల్లో జనం లేరని ఎంపీ భరత్ అన్నారు. సీట్ల సర్దుబాటు తదనంతర రాజకీయ పరిణామాలను ఇప్పటికైనా జనసేనాని గ్రహించి మేల్కొంటే మంచిదని హితవు పలికారు. చంద్రబాబు, పవన్ అజెండా జగన్ ను అధికారంలో నుంచి దింపడమే తప్పిస్తే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన, ప్రజాధనాన్ని అడ్డంగా లూటీ చేసిన టీడీపీకి ఎందుకు ఓటేయాలని ఎంపీ భరత్ ప్రశ్నించారు. గతంలో పెన్షన్ మంజూరు కావాలన్నా, నెలనెలా పెన్షన్ అందుకోవాలన్నా లబ్ధిదారుల అవస్థలు వర్ణనాతీతం అని.. ఈ రోజు ఇంటికే నేరుగా లబ్ధిదారులకు పెన్షన్ అందిస్తుంటే ఆ అవ్వాతాతల ముఖాలలో ఎంతో ఆనందం కనిపిస్తోందని అన్నారు. ప్రజలకు జగనన్న పాలనపై పూర్తి సంతృప్తి ఉందని.. మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు ఎంపీ మార్గాని భరత్ రామ్.
తాజావార్తలు
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!