Rangareddy : పిల్లలు ఏం చేశారు తల్లి.. అభం శుభం తెలియని వాళ్ల ప్రాణం తీశావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rangareddy : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మదర్స్ డే నాడే అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలు తీసి అమ్మ అనే పదానికి అర్థాన్నే మార్చిందో కఠినాత్మురాలు. భర్త, అత్తతో జరిగిన గొడవతో విచక్షణ కోల్పోయి తన ఇద్దరు కన్నకొడుకులను హతమార్చింది. ఈ దారుణానికి ఆ కన్న పేగు ఎలా ఒప్పుకుందో ఆలోచిస్తేనే కంట కన్నీరు ఆగడం లేదు. నవమాసాలు ఎంతో కష్టాన్ని ఓర్చి కని.. తన చేతులతోనే నీళ్ల టబ్బులో ముంచి చంపింది. ఆపై తాను విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ హృదయ విదారక ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం జరిగింది.
Read Also:Kamareddy : సహజీవనం చేస్తూనే రూ.6వేల కోసం గొడవ.. మహిళ ఇంటికి నిప్పు
Also Read
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
- UCC Bill: 'ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది'.. సీఎం సంచలన ప్రకటన..
- Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
- Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
వివరాల్లోకి వెళితే….రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కుబ్యా తండాకు చెందిన శ్రీనివాస్(34), భారతి(25)కి 2020లో పెళ్లైంది. ఉపాధి కోసం పట్నం వలస వచ్చారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జిల్లెలగూడలో నివాసముంటున్నారు. వీరి దాంపత్యానికి గుర్తుగా రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు కలిగారు. వీరికి విక్కీ(18 నెలలు), లక్కీ(8నెలలు). శ్రీనివాస్ ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తున్నాడు. కొంత కాలంగా శ్రీనివాస్, భారతి మధ్య మనస్పర్ధలు తల్లెత్తాయి. ముఖ్యంగా అత్త, కోడళ్లకు అసలు పడేది కాదు. ఈ క్రమంలో శ్రీనివాస్ తల్లి శనివారం జిల్లెలగూడలోని వీరి ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో అత్తాకోడళ్ల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో శ్రీనివాస్ భారతిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆదివారం ఉదయం భారతి తల్లిదండ్రులను తన ఇంటికి రప్పించుకుంది. వారు కూతురికి అల్లుడికి నచ్చజెప్పి వెళ్లిపోయారు. వారితో పాటే శ్రీనివాస్ కూడా బయటికి వెళ్లిపోయాడు.
Read Also:Karnataka: కర్ణాటక సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ.. డీకేకు బర్త్డే గిఫ్ట్ వచ్చేనా?
ఇంట్లో ఎవరి లేని సమయంలో దారుణంగా ప్రవర్తించింది. కన్న పేగు బంధాన్ని మరిచింది. తన ఇద్దరు కొడుకులని ఓ నీళ్ల టబ్బులో ముంచి చంపేసింది. అనంతరం.. ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. శ్రీనివాస్ తన భార్య భారతికి ఎన్ని సార్లు ఫోన్ చేసిన లిప్ట్ చేయకపోవడంతో హుటాహూటినా ఇంటికి వచ్చాడు. శ్రీనివాస్ తన పిల్లలను స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. అదే సమయంలో భారతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ విషయం తెలిసి పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
-
Kitchen Tips: వెల్లుల్లి తొక్క తీయడానికి ఇబ్బంది పడుతున్నారా? ఈ ఈజీ టిఫ్తో సెకన్లలో పని పూర్తి!
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!