Eluru: కన్న కూతుళ్లను బలిపెట్టిన కసాయితల్లి.. రెండో భర్తకు పిల్లలు పుట్టాలని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eluru: ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఒక గ్రామంలో దారుణం జరిగింది. రెండో వివాహం చేసుకున్న భర్త పిల్లలు కావాలనడంతో కన్న కూతుళ్లనే భర్త పరం చేసింది ఓ కసాయి తల్లి. తన రెండో భర్తకు సంతానం కలగాలని కన్నకూతుళ్లనే అతని వద్దకు పంపించి పిల్లలు పుట్టేలాగా చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆమెతో పాటు ఈ అఘాయిత్యానికి పాల్పడిన ఆమె రెండో భర్తను అదుపులోకి తీసుకున్నారు. ఆమె కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. భర్త అనారోగ్యంతో 2007లో ప్రాణాలు కోల్పోయాడు. తరువాత పుట్టా సతీష్ పవన్ కుమార్ (43)ను వివాహం చేసుకుంది. పిల్లలిద్దరినీ విశాఖపట్నంలోని తన పుట్టింటికి పంపించేసింది. ఆమెకు సంతానం కలగదని భావించిన సతీష్ కుమార్ మరో మహిళ ద్వారా సంతానం పొందుతానని చెప్పడంతో.. ఆమె తన ఇద్దరు కుమార్తెలు ఈడుకొచ్చారని, వారి ద్వారా సంతానం పొందాలని సూచించింది. పుట్టింటి వద్ద ఉన్న ఇద్దరు కూతుళ్లను తీసుకొచ్చింది. పెద్ద కుమార్తె 8వ తరగతి చదువుతున్న సమయంలో కన్న తల్లి ఆమెను సతీష్ కుమార్ వద్దకు పంపించింది. ఆ చిన్నారి ప్రతిఘటించినా వారిద్దరూ కలిసి చావబాదారు. ఆమె గర్భం దాల్చడంతో చదువు ఆగి, అందరికీ తెలిసిపోతుందని భయపడి అబార్షన్ చేయించారు.
Also Read: Crime News: దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం, హత్య.. చెట్టుకు వేలాడదీసి..
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
ఆ బాలిక పదోతరగతికి రావడంతో ఆ విద్యార్థినిని గర్భవతిని చేశారు. 17 ఏళ్ల వయస్సులో ఆ బాలిక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే సతీష్ మగబిడ్డ కావాలని చెప్పడంతో తన రెండో కూతురు(16) ను పంపింది. ఆమె కూడా గర్భం దాల్చ డంతో ఇంటిలోనే డెలివరీ చేశారు. ప్రాణం లేని మగశిశువు పుట్టడంతో ఆ బిడ్డను కాలువలో పడవేశారు. ఇటీవల సతీష్కు, ఆమెకు మధ్య గొడవలు రావడంకో తన పుట్టింటికి వెళ్లి పోలీస్స్టేషన్లో వేధింపుల కేసు పెట్టింది. దీంతో పోలీసులు కౌన్సెలింగ్కు పిలిచారు. ఆ తర్వాత సతీష్ అతని వద్ద ఉన్న తన భార్య కూతుళ్లిద్దరినీ తీసుకుని వచ్చాడు. అక్కడ ఆమె లేకపోవడంతో కుమార్తెలిద్దరినీ శారీరకంగా, మానసికంగా హింసించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆ బాలికల మేనమామ అక్కడకు చేరుకుని బాలికలను తీసుకెళ్లి దిశ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి పుట్టా సతీష్, అతని భార్యను అదుపులో తీసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె పెద్ద కూతురు మూడో నెల గర్భిణీ అని పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలికల జీవితాలతో ఆ కసాయి తల్లి ఆడుకుందని మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!