Maharastra : భర్తతో గొడవ.. కూతురిని చంపి శవంతోనే రోడ్లపై తిరిగిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharastra : మహారాష్ట్రలోని నాగ్పూర్లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. భర్తతో గొడవ పడి ఓ మహిళ తీవ్ర ఆగ్రహానికి గురై తన మూడేళ్ల పాపను గొంతుకోసి చంపేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హత్య అనంతరం మహిళ తన కుమార్తె మృతదేహంతో దాదాపు 4 కిలోమీటర్ల మేర రోడ్డుపై తిరుగుతూనే ఉంది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎంఐడీసీ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. నిందితురాలు 23 ఏళ్ల ట్వింకిల్ రౌత్, ఆమె భర్త రామ్ లక్ష్మణ్ రౌత్ (24) ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం నాగ్పూర్కు వెళ్లారు. వారు ఒక పేపర్ తయారీ కంపెనీలో పనిచేశారు. ఎంఐడీసీ ప్రాంతంలోని హింగ్నా రోడ్లోని కంపెనీ ప్రాంగణంలో ఒక గదిలో నివసిస్తున్నారని ఒక అధికారి తెలిపారు.
Read Also:Bhadradri Kothagudem: విషాదం.. కారులో ఊపిరాడక చిన్నారి మృతి..
Also Read
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
వీరి మధ్య పరస్పర అపనమ్మకం కారణంగా తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భార్యాభర్తలు మళ్లీ గొడవపడ్డారు. తీవ్ర వాగ్వాదం మధ్య వారి కుమార్తె ఏడవడం ప్రారంభించింది. దీంతో కోపోద్రిక్తుడైన మహిళ తన కుమార్తెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి చెట్టుకింద గొంతుకోసి హత్య చేసింది. అనంతరం మృతదేహంతో నాలుగు కిలోమీటర్ల మేర నడిచింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని చూసి భద్రతా సిబ్బందికి జరిగిన విషయాన్ని తెలియజేసినట్లు తెలిపారు. పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారని అధికారి తెలిపారు. అనంతరం పోలీసులు ఆ మహిళను అరెస్టు చేసి, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 (హత్య) కింద అభియోగాలు మోపారు. అనంతరం మహిళను కోర్టులో హాజరుపరిచామని, అక్కడి నుంచి మే 24 వరకు పోలీసు కస్టడీకి పంపామని అధికారి తెలిపారు.
Read Also:EVM Vandaalism: మాచర్ల సంఘటనపై సీఈసీ సీరియస్.. ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు
తాజావార్తలు
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!