Team India: టీ20ల్లో భారత్ విజృంభణ.. ఆస్ట్రేలియా రికార్డు సమం
- సౌతాఫ్రికాపై టీ20ల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన భారత్
- ఆస్ట్రేలియాను సమం చేసిన టీమిండియా
- 17-17 సార్లు దక్షిణాఫ్రికాను ఓడించిన భారత్.. ఆస్ట్రేలియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్లో భాగంగా.. నవంబర్ 13న సెంచూరియన్లో జరిగిన మ్యాచ్లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికాపై టీ20 ఇంటర్నేషనల్స్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన భారత్.. ఆస్ట్రేలియాను సమం చేసింది. టీ20 ఇంటర్నేషనల్లో భారత్, ఆస్ట్రేలియా రెండు జట్లు 17-17 సార్లు దక్షిణాఫ్రికాను ఓడించాయి. దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 25 మ్యాచ్ల్లో 17 విజయం సాధించగా.. భారత్ 30 మ్యాచ్ల్లో 17 సార్లు దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ జాబితాలో వెస్టిండీస్ మూడో స్థానంలో ఉంది.
Read Also: AUS vs IND: సచిన్ను తీసుకోండి.. బీసీసీఐకి రామన్ సూచన!
Also Read
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
వెస్టిండీస్ 26 మ్యాచ్ల్లో 14 సార్లు దక్షిణాఫ్రికాను ఓడించింది. ఇంగ్లండ్ 26 మ్యాచ్ల్లో 12 సార్లు దక్షిణాఫ్రికాను ఓడించింది. దక్షిణాఫ్రికాను 22 మ్యాచ్ల్లో 12 సార్లు ఓడించిన పాకిస్థాన్ ఐదో స్థానంలో ఉంది. శ్రీలంక 18 మ్యాచ్ల్లో ఐదుసార్లు దక్షిణాఫ్రికాను ఓడించగా, న్యూజిలాండ్ 15 మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికాను ఒకసారి ఓడించింది. సెంచూరియన్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 219 పరుగులు చేసింది. తిలక్ వర్మ 56 బంతుల్లో 107 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అతడితో పాటు అభిషేక్ శర్మ 25 బంతుల్లో 50 పరుగులు చేశాడు.
Read Also: Baba Siddiqui : బాబా సిద్ధిఖీ చనిపోయాడా లేదా అని కన్ఫాం చేసుకునేందుకు ఆస్పత్రిలో తిరిగిన షూటర్
దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 208 పరుగులు మాత్రమే చేసింది. దీంతో.. భారత్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మార్కో జాన్సన్ 17 బంతుల్లో 54 పరుగులు చేసి ఒక్కసారిగా మ్యాచ్ను తమ వైపు తిప్పినప్పటికీ.. చివరకు భారత్ గెలుపొందింది. అర్ష్దీప్ సింగ్ నాలుగు ఓవర్లలో 37 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. వరుణ్ చక్రవర్తి నాలుగు ఓవర్లలో 54 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. నాలుగు మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించగా, రెండో మ్యాచ్లో గెలిచి దక్షిణాఫ్రికా సిరీస్లో పునరాగమనం చేసింది. మూడో మ్యాచ్లో విజయం సాధించి భారత్ తిరుగులేని ఆధిక్యం సాధించింది.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!