Shocking Incident: ఏమైంది ఆ తల్లికి .. 15 రోజుల బిడ్డ విషయంలో ఎందుకలా చేసింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident: నవ మాసాలు మోసి, ప్రాణాలు పణంగా పెట్టి తన బిడ్డను భూమి మీదకు తీసుకువస్తుంది తల్లి. అందుకే మాతృమూర్తిని భగవంతుడు సైతం చేతులెత్తి మొక్కాలని చెబుతాడు. కానీ ఇక్కడ ఒక తల్లి తన బిడ్డ నిద్ర పోకుండా ఏడుస్తుందని ఏకంగా ఫ్రిజ్లో పెట్టింది. నవజాత శిశువు ఏడుపు విని ఇంట్లో వాళ్లు పరుగున వచ్చారు కాబట్టి సరిపోయింది.. లేదంటే తలుచుకోడానికి కూడా ఆలోచనలు లేవు. ఎందుకు ఆ తల్లి అలా చేసింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లికి ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా.. ఈ ఘటన వెలుగు చూసిన తర్వాత ఆ కుటుంబం ఏం చేసింది.. వైద్యులు ఏం అంటున్నారు.. అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Hardik Pandya: హార్దిక్ వాచ్ ధర అన్ని కోట్లా.. ఆసియా కప్ ప్రైజ్ మనీకి 10 రెట్లు!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
బిడ్డను ఫ్రిజ్లో పెట్టింది..
ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఒక మహిళ తన 15 రోజుల నవజాత శిశువు ఏడుస్తుందని, నిద్రలోకి జారుకోడానికి ఏకంగా ఫ్రిజ్లో పెట్టింది. ఆ శిశువు ఏడుపు విని ఇంట్లో ఉన్న వాళ్ల అమ్మమ్మ వెంటనే అక్కడికి వచ్చి ఆ శిశువును ఫ్రిజ్లోంచి బయటకు తీసింది. అమ్మమ్మ అటుఇటుగా వస్తే బిడ్డ పరిస్థితి ఏంటనేది ఆలోచించడానికి కూడా మనసు రావడం రాలేదు. బిడ్డను కాపాడిన అమ్మమ్మ మాట్లాడుతూ.. ఆ శిశువు నిద్రపోకుండా ఏడుస్తోందని, వాళ్ల అమ్మ ఆ శిశువును ఫ్రిజ్లో ఉంచిందని చెప్పింది. ఇది విని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఆ తల్లికి దయ్యం లాంటిది ఏమైనా పట్టిందని భావించిన వాళ్లు ఆమెను భూతవైద్యం చేసే బాబా వద్దకు తీసుకెళ్లారు. కానీ దాని వల్ల ఆమెకు ఏ ప్రయోజనం లేకపోయింది.
మానసిక వైద్యుడు.. మనిషిని చేశాడు..
తరువాత, ఒకరి సూచన మేరకు ఆ కుటుంబం ఆ మహిళను నగరంలోని మానసిక వైద్యుడు కార్తికేయ గుప్తా వద్దకు తీసుకెళ్లారు. ఆ డాక్టర్ ఆమెను పరీక్షించి చికిత్స ప్రారంభించాడు. ఈసందర్భంగా ఆ మానసిక వైద్యుడు మాట్లాడుతూ.. మహిళ పోస్ట్పార్టమ్ డిజార్డర్ అనే మానసిక అనారోగ్యంతో బాధపడుతోందని చెప్పారు. ఈ పరిస్థితి కొంతమంది మహిళల్లో డెలివరీ తర్వాత కనిపిస్తుందని, దాదాపు 10-15 శాతం మంది మహిళలు డెలివరీ తర్వాత పోస్ట్పార్టమ్ బ్లూస్ లక్షణాలతో ఇబ్బంది పడతారని చెప్పారు. ఈ లక్షణాలు సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాలలో తగ్గిపోతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా మారి ప్రసవానంతర నిరాశ లేదా మానసిక స్థితి సరిగ్గా లేకుండా మారవచ్చని అన్నారు. ప్రసవానంతరం స్త్రీలలో మానసిక సమస్యలు 0.1-0.2 శాతం మందిలో కనిపిస్తాయన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న స్త్రీలకు భ్రమలు, భ్రాంతులు, అధిక ఆందోళన, నిద్రలేమి, కొన్నిసార్లు తమ పట్ల లేదా పిల్లల పట్ల హానికరమైన రీతిలో ప్రవర్తించే ధోరణి ఉంటుందన్నారు.
చికిత్స ఉంది..
ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న స్త్రీలకు చికిత్స ద్వారా నయం చేయవచ్చు అన్నారు. ఈ సమస్యతో బాధపడుతున్న మహిళలు తమకు లేదా తమ బిడ్డకు ఎవరైనా హాని చేస్తారని భావిస్తారని, అయితే వీరికి చికిత్స చేసి నయం చేయవచ్చని డాక్టర్ చెప్పారు. ఈ సమస్యను మందులు, మానసిక వైద్యుడు ఇచ్చే సలహాలు, కుటుంబ మద్దతు అవసరం అని అన్నారు. సకాలంలో చికిత్స ప్రారంభించడం ద్వారా, సమస్యతో బాధపడుతున్న మహిళ పూర్తిగా కోలుకోవచ్చని, ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలని, తనకు మద్దతు అందించాలని సూచించారు.
READ ALSO: OYO: పేరు మార్చుకున్న ఓయో.. కొత్త పేరు ఏంటో తెలుసా..?
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!