Manipur : సీఎం కార్యక్రమంలో గందరగోళం..వేదికకు నిప్పుపెట్టిన దుండగులు
Manipur : మణిపూర్ రాష్ట్రంలో సీఎం పాల్గొనున్న కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. ఓ మూక సీఎం ఎన్ బీరెన్ సింగ్ శుక్రవారం పాల్గొనబోయే కార్యక్రమ వేదికకు నిప్పు పెట్టింది. ఈ ఘటన గురువారం రాత్రి చురచాంద్పూర్ జిల్లాలోని న్యూ లంకాలో జరిగింది. శుక్రవారం ఆ వేదిక పై సీఎం ఎన్ బీరెన్ సింగ్ కూర్చోవాల్సి ఉంది. గుర్తు తెలియని దుండగులు గురువారం రాత్రే దానికి నిప్పు పెట్టారు. దాంతో పాటు అక్కడే సీఎం బీరెన్ సింగ్ ప్రారంభించడాదనికి రెడీగా ఉన్న ఓపెన్ జిమ్నూ ఆ మూక ధ్వంసం చేసింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు వెంటనే కార్యరంగంలోకి దిగారు. ఆ మూకను చూసిన పోలీసులు వారిని చెదరగొట్టారు. వేదికతోపాటు వందలాది కుర్చీలు ధ్వంసం అయ్యాయి.
Read Also:RR vs CSK : చెన్నైపై రాజస్థాన్ గెలుపు.. 32 పరుగుల తేడాతో గెలిచిన రాజస్థాన్.
Also Read
సీఎం బీరెన్ సింగ్ న్యూ లంకాలోని పీటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ ఓపెన్ జిమ్ను శుక్రవారం ప్రారంభించాల్సింది. కానీ, ఆ ఓపెన్ జిమ్ను మూక నిప్పు పెట్టి పాక్షికంగా ధ్వంసం చేసింది. ఈ జిమ్ ఓపెనింగ్తోపాటు స్థానిక సద్బావన మండప్ నిర్వహించే ఓ పంక్షన్కూ సీఎం రేపు వెళ్లాల్సిన షెడ్యూల్ ఉన్నది. ముందుగా, ఇండిజీనస్ ట్రైబ్ లీడర్స్ ఫోరమ్ చురచాంద్పూర్ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బంద్ పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యం లోనే మూక ఈ దాడికి పాల్పడింది. రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా నుంచి రైతులను, ఇతర గిరిజనులను బయటకు పంపే కార్యక్రమాన్ని నిరసిస్తూ తాము ప్రభుత్వా నికి ఎన్నో మెమోరాండంలు అందించామని ఆ ఫోరమ్ చెప్పింది. కానీ, ప్రభుత్వం మాత్రం అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆలకించడానికీ అయిష్టత చూపెట్టిందని వివరించింది. అందుకే సీఎం పర్యటన నేపథ్యంలో చురచాంద్పూర్ బంద్కు పిలుపు ఇచ్చింది.
Read Also:Off The Record: సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి కుమారుడు..? బీఆర్ఎస్లో టిక్కెట్ పంచాయతీ..?
తాజావార్తలు
-
రితేష్-జెనీలియా డ్రీమ్ ప్రాజెక్ట్ ‘రాజా శివాజీ’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ!
-
Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
-
Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
-
Faria Abdullah: అతని కోసమే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను..
-
MS. Subbalakshmi : ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన బన్ని వాస్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!