MLA Seethakka: అక్కడి పరిస్థితిని చూసి కన్నీరు పెట్టుకున్న సీతక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోతగా వానలు పడుతుండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా వరంగల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా చాలాచోట్ల వరద నీటిలో వంతెనలు మునిగిపోయాయి.
Read Also: Sitara Ghattamaneni: లండన్ వీధుల్లో ఘట్టమనేని వారసురాలు..
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
అయితే, ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామం మొత్తం వరద నీటితో మునిగిపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఇవాళ (గురువారం) గ్రామ పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్యే సీతక్క కన్నీరు పెట్టారు. ఇప్పటికీ గ్రామంలో సుమారు వంద మంది ప్రమాదంలో ఉన్నారని, వారిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె వేడుకున్నారు. కొందరు గ్రామ పంచాయతీ కార్యాలయంపైనా ఉండిపోయారు. సహాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
Read Also: Congress: కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ వాయిదా
భారీగా వరదలతో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. పరిస్థితి మరింత చేదాటకముందే ములుగు ప్రాంత ప్రజలను రక్షించేందుకు హెలికాఫ్టర్ కేటాయించి రక్షించాలని ఆమె చేతులెత్తి వేడుకున్నారు. తమ వారిని వెంటనే రక్షించాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. దీనిపై ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు. మరోవైపు మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం నీట మునిగింది. గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది.
Read Also: Manipur Women Video: మణిపూర్ మహిళల వేధింపుల ఘటన.. కేసు సీబీఐకి అప్పగింత
అయితే, గోవిందరావు పేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో కోతకు గురైంది. దీంతో తాడ్వాయి, ఏటూరు నాగారం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. లక్నవరం జలాశయం పరవళ్లు తొక్కుతూ ఉండటంతో సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!