NTV Telugu Site icon

Nandamuri Balakrishna: లేపాక్షిలో ఉత్సవాలను మళ్లీ ప్రారంభిస్తాం.. అభివృద్ధి చేసి చూపిస్తాం..

Balakrishna

Balakrishna

Nandamuri Balakrishna: లేపాక్షిలో ఉత్సవాలను మళ్లీ పునః ప్రారంభిస్తాం… అభివృద్ధి చేసి చూపిస్తాం అన్నారు హిందూపురం ఎమ్మెల్యే, నటసింహ నందమూరి బాలకృష్ణ.. వరుసగా మూడోసారి గెలిచి హిందూపురంలో హ్యాట్రిక్‌ కొట్టిన బాలయ్య.. ఈ రోజు శ్రీ సత్యసాయి జిల్లాలోని తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడోసారి ముచ్చటగా గెలిపించినందుకు హిందూపురం ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, గత ప్రభుత్వ హయాంలో రోడ్లు దెబ్బతింటే గోతులు పడినా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు అని విమర్శించారు.. రవాణా వ్యవస్థ బాగుంటేనే దేశం బాగుపడుతుందని గతంలో స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చెప్పి చేసి చూపించారని గుర్తు చేశారు..

Read Also: Ravi Shastri: ఆ విషయం తెలియగానే కన్నీళ్లు వచ్చేశాయి.. రవిశాస్త్రి భావోద్వేగం!

ఇక, ఏ ఉద్యమం చేసిన ప్రజల్లోంచి స్పందన రావాలి.. మేం చేసిన ఉద్యమానికి ప్రజలు తోడయ్యారని తెలిపారు.. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు.. ఎదురు తిరిగిన వారి పైన ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం.. హత్యలు చేయడం, మానసికంగా శోభకు గురి చేయటం చేశారని ఆరోపించారు. ప్రజల నుంచి స్పందన నిశ్శబ్ద సునామీ లాగా వచ్చింది.. రాష్ట్రం నలుమూలల నుంచి అలలు ఎగిరినట్టు ప్రజలు భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులను గెలిపించారు.. నాకు హ్యాట్రిక్‌ విజయాన్ని అందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు.. రాష్ట్రంలో టీడీపీ కూటమిని గెలిపించారు. మూడోసారి ముచ్చటగా గెలిపించినందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు.. ఇక, అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం అన్నారు నందమూరి బాలకృష్ణ.