Sachin Tendulkar: భారతరత్న తిరిగి ఇచ్చేయాలంటూ సచిన్ ఇంటి ముందు ఎమ్మెల్యే నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Bachchu Kadu protests at Sachin Tendulkar’s home: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇంటి ముందు నిరసన చేప్టటినందుకు గానూ ఒక ఎమ్మెల్యే పాటు 22 మంది కార్యకర్తలు అరెస్టయ్యారు. ప్రహార్ జన్శక్తి పార్టీ ఎమ్మెల్యే బచ్చు కాడూ.. పార్టీ కార్యకర్తలతో కలిసి నిన్న ముంబై నగరంలోని బాంద్రాలో ఉన్న సచిన్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఆన్లైన్ గేమింగ్ యాప్ను ఎండార్స్ చేస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు లీగల్ నోటీసులు పంపుతామని రెండు రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చిన ఎమ్మెల్యే ఇంటి ముందు నిరసన చేపట్టారు.
Also Read: Uttarpradesh: కేంద్రమంత్రి ఇంట్లో శవం..కొడుకు పైనే అనుమానం
Also Read
- Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
- Hydrogen Fuel Cell Train: తొలి "హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్" రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
సచిన్ టెండూల్కర్ ఆన్ లైన్ గేమింగ్ యాప్ ‘డుబియస్’ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయంటూ ఎమ్మెల్యే నిరసన చేపట్టారు. ఎంతో మంది యువతకు ఆదర్శంగా ఉంటూ భారతరత్న పొందిన సచిన్ ఇలాంటి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం సరికాదన్నారు. ‘బ్యాటింగ్ టు బెట్టింగ్’ సచిన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంచెం కూడా బాధ్యత లేకుండా ఇలాంటి ప్రమోషన్స్ చేస్తున్నందకు భారత రత్నను వెనక్కి ఇచ్చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. ఎంతో మంది యువత ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, అధిక వడ్డీలకు డబ్బులు అప్పు తెచ్చి మరీ దీనిలో పెడుతున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే తెలిపారు.
యువత జీవితాలను నాశనం చేసే ఆన్లైన్ గేమింగ్ యాప్లను ప్రమోట్ చేయడం సిగ్గుచేటని అన్నారు.ఆన్లైన్ గేమ్ను ఎండార్స్ చేస్తున్న సచిన్.. లోకల్ గేమ్ అయిన మట్కాను ఎందుకు వదిలేశారని ఎద్దేవా చేశారు కడూ. ఎంతో ఉన్నతమైన భారతరత్న అవార్డును అందుకున్న వారు ఎండార్స్మెంట్ల నుంచి లాభం పొందటం కోసం ఎలాంటి వాటినైనా ప్రమోట్ చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇలాంటి ప్రకటనల నుంచి సచిన్ తప్పుకోకుంటే గణేష్ చతుర్థి సందర్భంగా నిర్వహించే ప్రతి గణేశ్ మండపం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇక ఎమ్మెల్యేతో సహా 22 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై సెక్షన్37 (నిషేధ ఉత్తర్వుల ఉల్లంఘన), 135 (చట్టాన్ని ఉల్లంఘించడం) కింద కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తాజావార్తలు
-
Hormuz Strait Crisis: త్వరలో హార్మూజ్ తెరవకపోతే సంక్షోభమే.. IEA చీఫ్ ఆందోళన
-
PV Sindhu: జపాన్ ఓపెన్లో పీవీ సింధు చరిత్ర.. 16 ఏళ్ల తర్వాత సెమీస్లోకి దూసుకెళ్లిన రెండో భారత మహిళా షట్లర్
-
Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
-
Delhi Police Commissioner: ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్.. ఎవరు ఈ అనురాగ్ కుమార్..?
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?