Mithali Raj: టీమిండియాలో ఈ మార్పులు కచ్చితంగా చేయాల్సిందే.. లేదంటే ఇంటి బాట పట్టడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ20 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైన నేపథ్యంలో, జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలని మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సూచించారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను ఐదో స్థానానికి బదులు నాలుగో స్థానంలో బ్యాటింగ్కు పంపాలని, జెమిమా రోడ్రిగ్స్ను ఐదో స్థానంలో దించాలని ఆమె అభిప్రాయపడ్డారు.
బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు అవసరం..
ఈ మ్యాచ్లో భారత్ ఓడిపోవడం నిరాశ కలిగించిందని, ఒకవేళ గెలిచి ఉంటే పట్టికలో అగ్రస్థానానికి చేరుకునేదని మిథాలీ పేర్కొన్నారు. “హర్మన్ప్రీత్ సాధారణంగా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయదు. కాబట్టి ఆమెను నాలుగో స్థానంలో, జెమిమాను ఐదో స్థానంలో పంపడం మంచిది. జెమిమా గతంలో ఐదో స్థానంలో ఆడి చాలా పరుగులు చేసింది. ఆమె క్రీజులోకి వచ్చే సమయానికి స్పిన్నర్లు బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. స్పిన్ను ఎదుర్కోవడం జెమిమా బలం. ఆమె స్వీప్స్, స్కూప్ షాట్లు బాగా ఆడుతుంది, ఇది ఆమెకు తిరిగి ఫామ్లోకి రావడానికి సహాయపడుతుంది” అని జియోస్టార్తో మాట్లాడుతూ మిథాలీ వివరించారు.
Also Read
- Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
- AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
- Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
శ్రీ చరణి బౌలింగ్పై ప్రశంసలు..
ఈ మ్యాచ్లో భారత్ 158 పరుగులు చేసినప్పటికీ, దక్షిణాఫ్రికా బ్యాటర్ మరిజానే కాప్ (45 బంతుల్లో 81 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్తో భారత్కు ఓటమి తప్పలేదు. అయితే, ఈ మ్యాచ్లో భారత యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి ప్రదర్శనను మిథాలీ ప్రత్యేకంగా అభినందించారు.
“శ్రీ చరణి చాలా వేగంగా నేర్చుకుంటుంది. పిచ్ నుండి పెద్దగా టర్న్ లభించకపోయినా, ఆమె స్టంప్స్ లైన్ను లక్ష్యంగా చేసుకుని అద్భుతంగా బౌలింగ్ చేసింది. వేగం, లెంగ్త్లో వైవిధ్యం చూపిస్తూ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు తీసి భారత్ను మ్యాచ్లోకి తీసుకువచ్చింది” అని మిథాలీ కొనియాడారు.
సెమీస్ చేరాలంటే..
ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి. గ్రూప్-A లో భారత్ తన తదుపరి మ్యాచ్లలో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాపై ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది. ముఖ్యంగా బలమైన ఆస్ట్రేలియాను ఓడిస్తేనే భారత్ సెమీస్ రేసులో నిలుస్తుంది.
తాజావార్తలు
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!