శ్రీకాంత్, రాజేంద్రప్రసాద్, లయ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’. బ్లూ.J క్రియేషన్స్ బ్యానర్ పై GK, చందు నిర్మాణంలో జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది. అలీ, సునీల్, రఘుబాబు, బాబూమోహన్, ధనరాజ్, వెన్నెల కిషోర్, పృథ్వీ, మురళి గౌడ్, కరుణ భూషణ్.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ సినిమా ఎలా ఉందంటే .
కథ విషయానికొస్తే..
వెంకటరమణ(శ్రీకాంత్) ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మ్యాన్. వేంకటేశ్వరస్వామికి వీర భక్తుడు. తన భార్య పద్మావతి(లయ), తండ్రి ఏడుకొండలు(మురళి గాడ్), చెల్లి(కరుణ), బావ(భూపాల్), పిల్లలతో కలిసి ఉంటాడు. వీళ్లంతా ఓ హోటల్ నడిపిస్తూ అది బాగా సాగినా అత్యాశకు పోయి అప్పు చేసి మరీ రెస్టారెంట్ పెట్టి లాస్ అవుతారు.చివరికి జాబ్ కూడా పోయి వేంకటేశ్వరస్వామిని తిట్టుకొని తనని చంపేయమని సెక్యూరిటీ గార్డ్ గా చేరి గుడి మెట్ల మీద నిద్రపోతాడు. దీంతో వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమై బుక్ ఇచ్చి అందులో ఏం రాస్తే అదే జరుగుగుతుంది అని కొన్ని కండిషన్స్ పెడతాడు. అసలు ఆ బుక్ ఏంటి? ఆ బుక్ కి ఉన్న కండిషన్స్ ఏంటి? ఆ బుక్ తో వెంకటరమణ కష్టాలు తీరాయా? వాళ్ళ కుటుంబం జీవితం ఎలా మారింది అనేదే మిగిలిన కథ..
సినిమా విశ్లేషణ..కామెడీ సినిమాల దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి ఆయన పాత స్టైల్ లోనే తెరకెక్కించారు. ఓపెనింగ్ తోనే వెంకటరమణ కష్టాలు అన్ని ఒకదాని తర్వాత ఒకటి చూపించి కాస్త ఎమోషనల్ చేస్తారు. ఆ మిడిల్ క్లాస్ కష్టాలకు కనెక్ట్ అవ్వాల్సిందే. వేంకటేశ్వరస్వామి భూమి మీదకు వచ్చే గ్రాఫిక్స్ బాగుంటాయి. ఆయన ఇచ్చే నగలతో కాసేపు కామెడీ బాగానే నడిపించారు. ఆ తర్వాత బుక్ ఇచ్చిన దగ్గర్నుంచి కథ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది.
ఆ బుక్ తోనే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చి సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొల్పారు. ఇక సెకండ్ హాఫ్ అంతా ఆ బుక్ చేతులు మారడం, ఆ బుక్ లో రాసినవి జరగడం, మనిషి అత్యాశకు పోవడం, దేవుడి రాతనే మార్చాలని చూడటం, యముడి రావడం.. ఇలా కాస్త ఆసక్తిగా మనిషి ఆశ, అత్యాశ, ద్వేషం, బాధ, గర్వం.. లాంటి లక్షణాలు చూపిస్తూ సరదాగా సాగుతుంది. క్లైమాక్స్ లో వెన్నెల కిషోర్ స్పూఫ్ బాగుంటుంది.
ఫ్యామిలీ ఆడియన్స్ కి, మిడిల్ క్లాస్ వ్యక్తులకు కనెక్ట్ అవుతుంది.సరదాగా కాసేపు ఫ్యామితో కలిసి చూడాలి అనుకుంటే ఈ సినిమా చూడొచ్చు.
నటీనటుల పర్ఫార్మెన్స్..శ్రీకాంత్, లయ బాగా నటించారు. రాజేంద్రప్రసాద్ మొదటిసారి చేసినా వేంకటేశ్వరస్వామి పాత్రలో ఒదిగిపోయారు. మురళీధర్ గౌడ్, అలీ, వెన్నెల కిషోర్ నవ్విస్తారు. ధనరాజ్ యముడి పాత్రలో సీరియస్ గా కనిపించి పర్వాలేదు అనిపించారు. సునీల్ చివర్లో విలన్ గా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి పర్వాలేదనిపించారు. రఘుబాబు, పృథ్వీ, కరుణా భూషణ్, భూపాల్,బాబు మోహన్, చైల్డ్ ఆర్టిస్టులు.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు.సాంకేతిక అంశాలు. దేవుడు కనిపించి వరాలు ఇస్తే భక్తులు ఏం చేస్తారు అనే పాత కథతో కొత్త కథనంతో కామెడీ ఎమోషనల్ గా రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.
ఓవరాల్ : మిస్టర్ మిడిల్ క్లాస్.. సరదాగా నవ్వుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్

