Miss World 2025: చార్మినార్ వద్ద “హెరిటేజ్ వాక్”లో పాల్గొననున్న ప్రపంచ సుందరీమణులు.!
- హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్-2025 (Miss World 2025) పోటీలు
- చార్మినార్ వద్ద "హెరిటేజ్ వాక్"లో పాల్గొననున్న ప్రపంచ సుందరీమణులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Miss World 2025: హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్-2025 (Miss World 2025) పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రపంచ సుందరీమణులు నేడు (మే 13) నగరంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. మొత్తం ప్రపంచంలోని 109 దేశాల నుంచి వచ్చిన ఈ సుందరీమణులు నగరంలోని చారిత్రక ప్రదేశమైన చార్మినార్ వద్ద ‘హెరిటేజ్ వాక్’లో పాల్గొననున్నారు.
Read Also: WTC Final: ఐపీఎల్ 2025 సందిగ్ధత మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్కు జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా..!
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఈ కార్యక్రమం కోసం 4 ప్రత్యేక బస్సుల్లో చార్మినార్ వద్దకు సుందరీమణులు చేరుకోనున్నారు. ఆలా చేరుకున్న వారికి పాతబస్తీ ఏరియా ప్రసిద్ధ మార్ఫా వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. ఆ తర్వాత చార్మినార్ వద్ద ప్రత్యేక ఫోటో షూట్ను కూడా నిర్వహించబోతున్నారు. అంతేకాక, చార్మినార్ సమీపంలోని చుడీ బజార్లో ఎంపిక చేసిన తొమ్మిది ప్రముఖ దుకాణాల్లో ఈ సుందరీమణులు షాపింగ్ చేయబోతున్నారు. గాజులు, ముత్యాల హారాలు, ఇంకా అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడమే కాక.. అక్కడే గాజులు తయారీ విధానాన్ని కూడా స్వయంగా సుందరీమణులు పరిశీలించనున్నారు.
Read Also: Tiranga Yatra: భారత సైనికుల త్యాగాలకు గౌరవంగా దేశవ్యాప్తంగా ‘తిరంగా యాత్ర’ చేపట్టనున్న బీజేపీ.!
ఈ కార్యక్రమం తర్వాత మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ చౌమల్లా ప్యాలెస్లో జరిగే ప్రత్యేక విందుకు హాజరు కానున్నారు. అక్కడ వారికోసం మెహందీ కార్యక్రమం, నిజామీ సాంప్రదాయ దుస్తులు ధరించే ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. ఆపై తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే డాక్యుమెంటరీ సినిమాలను కూడా వీరికి చూపించనున్నారు. ఇక చివరగా చౌమల్లా ప్యాలెస్లో ప్రత్యేకంగా వెల్కమ్ డిన్నర్ ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా చార్మినార్ జోన్ పరిధిలో ట్రాఫిక్ను మళ్లించేందుకు పోలీస్ శాఖ ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా మిస్ వరల్డ్ పోటీదారులకు హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయం, ఆతిథ్యాన్ని చూపించే అవకాశంగా భావిస్తున్నారు నిర్వాహకులు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?