Site icon NTV Telugu

Miss India- Miss Universe : టాలీవుడ్ తెరపై మిస్ ఇండియా, మిస్ యూనివర్శ్, మిస్ బ్యూటీఫుల్స్

Tollywood

Tollywood

మిస్ ఇండియా, మిస్ యూనివర్శ్, మిస్ వరల్డ్ లాంటి అంతర్జాతీయ అందాల పోటీల్లో విన్నర్ ఆర్ రన్నర్ అయిన భామలు ఎక్కువగా బాలీవుడ్‌లోనే కాలక్షేపం చేస్తుంటారు. ఎప్పుడో అడపా దడపా సౌత్ సినిమాల వైపు తొంగి చూసేవారు. కానీ కాలం మారింది. సౌత్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా మారడంతో అందాల పోటీల్లో విన్నర్, రన్నర్‌గా నిలిచిన భామలు టాలీవుడ్ తెరపై ప్రత్యక్షమౌతున్నారు. ప్రజెంట్ టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా దూసుకెళుతోన్న మీనాక్షి చౌదరి.. 2018 మిస్ ఇండియా పోటీల్లో మొదటి రన్నరప్‌గా నిలిచింది. వెంటనే హిందీలో కెరీర్ స్టార్ట్ చేసిన మీనూ టాలెంట్ టాలీవుడ్ గుర్తించింది. రీసెంట్లీ అనగనగా ఒక రాజుతో హాయ్ చెప్పిన మీనాక్షి.. త్వరలో వృషకర్మతో రాబోతుంది.

Also Read : OTT Releases This Week : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే

టాలీవుడ్ స్క్రీన్‌పై తళుక్కున మెరుస్తోన్న మరో మిస్ ఇండియా మానస వారణాసి. 2020 ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలిచిన ఈ తెలుగమ్మాయి.. బాలీవుడ్ ఆఫర్స్ కాదని.. తెలుగులోకి ఇంట్రడ్యూసైంది. దేవకీ నందన వాసుదేవతో పరిచయమైన మానస.. కపుల్ ఫ్రెండ్లీతో తన లక్ పరీక్షించుకోబోతుంది. అలాగే 2024 మిస్ యూనివర్శ్ ఇండియా అందాల కిరీటాన్ని కైవసం చేసుకున్న రియా సింఘా సత్య హీరోగా నటిస్తున్న జెట్లీ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.  వారణాసితో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మోస్ట్ బ్యూటీఫుల్ గర్ల్ ప్రియాంక చోప్రా కూడా 2000 మిస్ వరల్డ్ విన్నర్. ఆమె టాలీవుడ్ ఎంట్రీ అప్పట్లోనే జరగాల్సింది కానీ అనివార్య కారణాలతో ఆగిపోయింది. బాలీవుడ్‌లో స్టార్ డమ్ సంపాదించి హాలీవుడ్ చెక్కేసిన ప్రియాంక చోప్రా మళ్లీ ఇన్నాళ్లకు తెలుగు ఆడియన్స్‌కు మందాకినిగా కనిపించబోతోంది. 2016 అంతర్జాతీయ అందాల పోటీలో విన్నరైన శ్రీనిధి శెట్టి రైజింగ్ బ్యూటీగా మారింది. 2013లో మిస్ ఇండియా ఎర్త్ రన్నరప్ టైటిల్ గెలిచిన శోభితా.. ఏడాది క్రితం మ్యారేజ్ లైఫ్‌లోకి ఎంటరై.. తాజాగా చీకటిలో అనే ఓటీటీ ఫిల్మ్‌తో హాయ్ చెప్పింది. మొత్తానికి టాలీవుడ్ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేస్తున్నారు ఈ బ్యూటీఫుల్ గర్ల్స్.
స్పాట్ః వారణాసి ఈవెంట్లో ప్రియాంక విజువల్స్

Exit mobile version