NTV Telugu Site icon

Warangal: రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మంత్రులు సీతక్క, కొండా సురేఖ రివ్యూ..!

Sithakka

Sithakka

రేపు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అమంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి సీఎంకు నివేదించనున్న పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, భూగర్భ డ్రైనేజీ, రింగ్ రోడ్డు, కాళోజీ కళాక్షేత్రం, మామునూరు ఎయిర్ పోర్ట్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు, హనుమకొండ ఐడీఓసీ కార్యాలయంలో చేపట్టనున్న వన మహోత్సవం, మహిళా శక్తి కార్యక్రమం తదితర అంశాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమాలోచనలు చేశారు.

Read Also: Maharashtra: ఒకే లిఫ్ట్‌లో ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే.. ‘‘సీక్రెట్ మీటింగ్’’..

ఇక, సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ను జాగ్రత్తగా పర్యవేక్షించడంతో పాటు ఎలాంటి లోటు పాట్లు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని మంత్రి సీతక్క, కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్, హన్మకొండ కలెక్టర్లు సత్య శారదా దేవి, ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, పలువురు అధాకారులు తదితరులు పాల్గొన్నారు.