Minister Seethakka: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై అనవసర రాజకీయాలు చేయొద్దు
- మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి సీతక్క సమీక్షా సమావేశం.
- అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలని అధికారులకు సూచన.
- అనవసర రాజకీయాలు తావివ్వకుండా పథకం అమలు చేయాలంటూ ఆదేశాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: హైదరాబాద్ నగరంలోని ఎర్రమంజిల్ లో ఉన్న మిషన్ భగీరథ కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి కార్యదర్శి లోకేష్ కుమార్, డైరెక్టర్ సృజనతో పాటు అన్ని జిల్లాల డిఆర్డిఓల అధికారులు హాజరయ్యారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుపై దిశానిర్దేశం చేస్తూ మంత్రి పలు కీలక సూచనలు చేశారు. కూలీల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేస్తామన్న మంత్రి, ఉపాధి హామీ పథకం కింద మహిళా కూలీలకు వారి బ్యాంకు ఖాతాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మొత్తాన్ని జమ చేస్తామని పేర్కొన్నారు.
Also Read: Sanchar Saathi App: స్పామ్ కాల్స్ ఆటకట్టు.. సంచార్ సాథీ యాప్ తీసుకొచ్చిన కేంద్రం
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం కావడం వల్ల మహిళల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడం జరుగుతోందని ఆమె అన్నారు. ఇలాంటి పథకాన్ని తీసుకురావడం పేద కుటుంబం నుంచి వచ్చిన నాకు ఎంతో ఆనందం అని మంత్రి తెలిపారు. గ్రామసభలు శాంతియుత వాతావరణంలో జరగాలని.. అర్హుల గుర్తింపు, లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల వేదికగానే జరగాలని మంత్రి స్పష్టం చేశారు. గ్రామ సభ నిర్ణయమే ఫైనల్ అంటూ.. అనవసర రాజకీయాలు, కవ్వింపు చర్యలకు తావివ్వకుండా పథకం అమలులో అధికారులు మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని మంత్రి సూచించారు.
Also Read: Manchu Manoj: విష్ణుకి మనోజ్ ఛాలెంజ్.. నేను ఒక్కడినే ఏ ప్లేస్ కైనా వస్తా!
తెలంగాణలో అటవీశాఖ అనుమతులు పెండింగులో ఉండడంతో కొన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయని, ఈ విషయాన్ని సీఎం ఇటీవల కేంద్ర మంత్రికి వివరించారని మంత్రి సీతక్క తెలిపారు. కేంద్ర మంత్రి ఆదేశాలపై తెలంగాణకు వచ్చిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్ జితేంద్ర కుమార్, పెండింగులో ఉన్న 161 ప్రాజెక్టులపై సమావేశం నిర్వహించారని పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ చేయని టీఆర్ఎస్ ఇప్పుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తోందని, కూలీలకు రూపాయి సహాయం చేయని పెద్దలు విమర్శలు చేయడం హాస్యాస్పదం అంటూ పేర్కొన్నారు. కానీ, మన ప్రభుత్వం రైతు భరోసా, పంట బోనస్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాల ద్వారా కూలీలకు, రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని మంత్రి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందించాలని, పథకాన్ని విఫలమయ్యేలా కుట్రలకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. పథకం అమలులో లోటుపాట్లను సవరించి అభివృద్ధి, సంక్షేమం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!