Minister Seethakka: గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి..
- గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి- మంత్రి సీతక్క
- త్వరలోనే మహిళలకు మీసేవ.. పౌల్ట్రీ.. డైరీ వ్యాపారాలు ఏర్పాటుకు ప్రోత్సాహం అందించనున్న ప్రభుత్వం
- ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో..
- ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. త్వరలోనే మహిళలకు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుందని అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు.
Kandula Durgesh : గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే
Also Read
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో కలెక్టరేట్, ఏరియా ఆసుపత్రి, ఐటిడిఏ, రామప్ప దేవాలయం ఆవరణాలలో మొత్తం నాలుగు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో మొదటి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ సంవత్సరం 20 వేల కోట్ల రూపాయలు రుణాలు బ్యాంక్ లీకేజీ ద్వారా అందించామని పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ప్రారంభించడం జరుగుతుందని.. నూతనమైన ఆహార పదార్ధాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.
ChatGPT in Telugu: తెలుగులో చాట్జీపీటీ.. జులై 10న డేటాథాన్ సదస్సు!
త్వరలోనే మహిళలు మీ సేవ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, డైరీ ఫాంలు, సోలార్ లైట్స్.. అదేవిధంగా 60 లక్షల పాఠశాల ఏక రూప దుస్తులను మహిళా సంఘాల ద్వారా కుట్టించామని పేర్కొన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లలో ఆహారం అమ్మ చేతి వంటల ఉండాలని.. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మహిళా శక్తి క్యాంటీన్లు దేశానికే ఒక బ్రాండ్ గా నిలవాలని, స్థానిక వనరులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మహిళా శక్తి బిజినెస్ మోడల్స్ ను త్వరలోనే రూపొందిస్తామన్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందించడంతో పాటు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు, క్యాంటీన్ల ఏర్పాటుకు అన్ని రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందించడంతోపాటు.. వడ్డీ లేని రుణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.
తాజావార్తలు
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
-
Gongura Pulihora: పక్కా పల్లెటూరి స్టైల్లో ‘గోంగూర పులిహోర’.. 10 నిమిషాల్లో ఐరన్ లోపానికి విరుగుడు!
-
PBKS vs DC : ఢిల్లీ ముందు 211 పరుగుల భారీ లక్ష్యం.. శ్రేయాస్, ప్రియాన్ష్ మెరుపులు.!
-
Punjab: బీజేపీలో చేరిన పంజాబ్ సీఎం బంధువు జ్ఞాన్ సింగ్
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?