Minister Seethakka: గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి..
- గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి- మంత్రి సీతక్క
- త్వరలోనే మహిళలకు మీసేవ.. పౌల్ట్రీ.. డైరీ వ్యాపారాలు ఏర్పాటుకు ప్రోత్సాహం అందించనున్న ప్రభుత్వం
- ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో..
- ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామీణ మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. త్వరలోనే మహిళలకు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించనుందని అన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో.. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పాల్గొన్నారు.
Kandula Durgesh : గతంలో జరిగిన మూడు పుష్కరాలు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే
Also Read
- Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో కలెక్టరేట్, ఏరియా ఆసుపత్రి, ఐటిడిఏ, రామప్ప దేవాలయం ఆవరణాలలో మొత్తం నాలుగు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో మొదటి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈ సంవత్సరం 20 వేల కోట్ల రూపాయలు రుణాలు బ్యాంక్ లీకేజీ ద్వారా అందించామని పేర్కొన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ప్రారంభించడం జరుగుతుందని.. నూతనమైన ఆహార పదార్ధాలతో క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.
ChatGPT in Telugu: తెలుగులో చాట్జీపీటీ.. జులై 10న డేటాథాన్ సదస్సు!
త్వరలోనే మహిళలు మీ సేవ కేంద్రాలు, ఈవెంట్ మేనేజ్మెంట్, డైరీ ఫాంలు, సోలార్ లైట్స్.. అదేవిధంగా 60 లక్షల పాఠశాల ఏక రూప దుస్తులను మహిళా సంఘాల ద్వారా కుట్టించామని పేర్కొన్నారు. మహిళా శక్తి క్యాంటీన్లలో ఆహారం అమ్మ చేతి వంటల ఉండాలని.. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మహిళా శక్తి క్యాంటీన్లు దేశానికే ఒక బ్రాండ్ గా నిలవాలని, స్థానిక వనరులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మహిళా శక్తి బిజినెస్ మోడల్స్ ను త్వరలోనే రూపొందిస్తామన్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలు అందించడంతో పాటు మీసేవ, పౌల్ట్రీ, డైరీ వ్యాపారాలు, క్యాంటీన్ల ఏర్పాటుకు అన్ని రకాల ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందించడంతోపాటు.. వడ్డీ లేని రుణ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు.
తాజావార్తలు
-
Bigg Boss 10: బిగ్ బాస్ సెట్ వర్క్ మొదలు.. ఆరోజు నుంచే షో.!
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!