నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్స్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధిలో మాత్రం వెనుకబడింది అని పేర్కొనింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నన్ను ఇన్చార్జిగా నియమించడం నా అదృష్టం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ పై ఎంతో ప్రేమ ఉంది.. సీఎం అయిన తర్వాత పర్యటన సైతం ఇక్కడినుండే మొదలు పెడతారు అని ఆమె చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ జిల్లాపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Read Also: Mahesh Babu: గుంటూరు ఫ్యాన్స్ కోసం మహేష్ స్పెషల్ పోస్ట్…
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి.. ఓడిన అభ్యర్థులు సైతం ప్రజల్లో ఉండి వారి కష్ట సుఖాలు తీర్చేందుకు ముందుండాలి అని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే ఆటో సంఘాలతో ఆందోళన చేయించిన ఘనత బీఆర్ ఎస్ పార్టీది.. తాము అధికారంలోకి వచ్చిన రెండు రోజుల నుంచే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ దూషించడం మొదలు పెట్టింది అనే విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇంట్లోని 5 ఉద్యోగాలు పోవడంతో వారి ఆటలు సాగడం లేదు.. రాహుల్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం, పదవుల కుటుంబం కాదు.. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ కుటుంబం పదవులను అనుభవించింది అని మంత్రి సీతక్క విమర్శలు గుప్పించింది.