Minister Ramanaidu: ఆ అంశంలో తెలంగాణ సహకరించాలి.. ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!
- పోలవరం, బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష జరిగింది
- బనకచర్ల పై తెలంగాణ నేతలు మాట్లాడచ్చు
- కరువుకు కారణం నదుల అనుసంధానం లేకపోవడమే
- మంత్రి రామానాయుడు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలవరం, బనకచర్ల, ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష జరిగిందని.. తుపాన్ బారి నుంచి పంటలు కాపాడుకునే విధంగా చర్యలు తీస్కుంటున్నామని మంత్రి రామానాయుడు అన్నారు. పంట కాలాన్ని ముందుకు తీసుకు వచ్చే చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పినట్లు తెలిపారు. నీటి లభ్యత బులెటిన్ విడుదల చేస్తామని.. పండించే పంటలకు అనుగుణంగా రైతులకు సూచనలు ఇస్తామని స్పష్టం చేశారు. భూ గర్భ జలాలు పెంచు కోవడం పై దృష్టి పెడుతున్నామన్నారు. రిజర్వాయర్ లో నీటి నిల్వలు.. 516 టీఎంసీ వరకు ఉన్నాయని.. ఖరీఫ్ ప్రారంభానికి ముందు కూడా నీటి నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. రాయలసీమ ప్రాంతంలో కూడా నీటి నిల్వలు ఉన్నాయన్నారు. పోలవరం బనకచర్ల అటవీ పర్యావరణ అనుమతిపై దృష్టి పెడుతున్నామని.. భూ సేకరణపై కూడా కసరత్తు జరుగుతోందన్నారు. హంద్రీ నీవా ప్రాజెక్ట్ కు బడ్జెట్ లోటు లేకుండా చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర కు గోదావరి జలాలను తీసుకెళ్లే పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రొజెక్ట్ కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
READ MORE: Trump vs Musk: ఎలాన్ మస్క్ అక్రమ గ్రహాంతరవాసి.. అమెరికా వదిలి వెళ్లిపోవాలి..
Also Read
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
- West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
- August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
- Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
పోలవరం పనుల పై సీఎం సంతృప్తితో ఉన్నారని మంత్రి రామానాయుడు అన్నారు. “బుడమేరు కు గండ్లు పడకుండా సీసీ వాల్ నిర్మాణం జరుగుతోంది. విజయవాడకు బుడమేరు వల్ల ఇబ్బంది లేకుండా ప్లాన్ జరుగుతోంది. బుడమేరు ఓల్డ్ ఛానెల్ పనులు.. అదే విధంగా ఎనికపాడు నుంచి కెపాసిటీ పెంచే చర్యలు జరగాలి.. రాజకీయ పరమైన కారణాలతో బనకచర్ల పై తెలంగాణ నేతలు మాట్లాడచ్చు. దేశంలో కరువు కాటకాలకు కారణం నదుల అనుసంధానం లేకపోవడమే అని నిపుణులు చెప్తున్నారు. గోదావరి నుంచి వృథాగా నీరు సముద్రం లోకి పోతోంది. వర్షాలు ప్రారంభం కాకుండానే వృథాగా నీరు పోతోంది. 3000 టీఎంసీలు వృథాగా పోతోంది. కేవలం 200 టీఎంసీలు మాత్రమే ఉపయోగిస్తున్నాం. తెలంగాణ సహకరించాలి. అర్థం చేసుకోవాలి. భవిష్యత్ లో నదుల అనుసంధానమే మార్గం..” అని మంత్రి రామానాయుడు వెల్లడించారు.
READ MORE: Covid-19 Variant: వేగంగా వ్యాపిస్తున్న కొత్త కోవిడ్ వేరియంట్.. లక్షణాలు ఎలా ఉన్నాయంటే..?
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!