Merugu Nagarjuna: ఎల్లుండి అంబేద్కర్ విగ్రహావిష్కరణ.. ఆయన ఆలోచనలు భారతావనికి దిక్సూచి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు సిద్ధం అవుతోంది.. ఎల్లుండి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఆ కార్యక్రమం జరగనుంది.. ఈ సందర్భంగా విజయవాడలో బీఆర్ అంబేద్కర్ ఒకరోజు కాంక్లేవ్ నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై.శ్రీలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానాకి మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. ఏపీలో అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. ముళ్ల కంపల్లో పెట్టడానికి సిద్ధమైంది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. తమ ప్రభుత్వం మాత్రం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రతిమను ప్రపంచం గౌరవించేలా ఏర్పాటు చేశాం అన్నారు.
Read Also: Krishna Bridge: వాహనదారులు అలర్ట్.. 45 రోజులపాటు కృష్ణ బ్రిడ్జి బంద్..!
Also Read
- DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
- Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
- Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
- Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
ఎల్లుండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారని తెలిపారు మంత్రి నాగార్జున. రాజ్యాంగం దేశంలో అసమానతలు పోవడానికి ఉపయోగపడుతోందన్న ఆయన.. అంబేద్కర్ అనేక అవమానాలు పొందారు.. కానీ, ఇప్పుడు అంబేద్కర్ ఆలోచనలు భారతావనికి దిక్సూచిగా ఉండటానికి పనికొస్తాయి అన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని భుజానికి ఎత్తుకుని పరిపాలన చేయాలని చూపిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పేర్కొన్నారు. మేం చదువుకున్న రోజుల్లో ఇంగ్లీషు చదవాలంటే భయపడే వాళ్లం.. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోనూ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు రాణిస్తున్నారని తెలిపారు మంత్రి మేరుగు నాగార్జున.
ఇక, మున్సిపల్ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వై.శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. అంబేద్కర్ ఒక లెజెండ్… నెల్సన్ మండేలా లాంటి వారి వరుసలో అంబేద్కర్ ఉంటారు.. మన ఆలోచనా విధానం మార్చుకోవడమే మన విజ్ఞానాభివృద్ధికి పనిచేస్తుందన్నారు. కుల ప్రాతిపదికన అంబేద్కర్ తన అటెండర్లతో గేలి చేయబడ్డారు.. అంబేద్కర్ కు ఉన్న డిగ్రీలకు ఆయన సంపాదించుకోటం చాలా తేలిక అని గాంధీ అన్నారని గుర్తుచేశారు. 1942 లో లేబర్ మినిస్టర్ గా పనిచేసారు అంబేద్కర్.. భారత రాజ్యాంగ రచనా కమిటీ కి చైర్మన్ గా అంబేద్కర్ ఉన్నారు.. అంబేద్కర్ విగ్రహం ఎంతో ఎత్తైనది, విగ్రహం కింద ఉన్న మ్యూజియం అందరూ సందర్శించాలని సూచించారు. భారతరత్న అవార్డు తీసుకున్న అంబేద్కర్ కు ఈ విగ్రహం అంకితం ఇస్తామన్నారు శ్రీలక్ష్మి.
తాజావార్తలు
-
Rohit-Hardik: ముందు బెంగళూరుకు రండి.. రోహిత్, హార్దిక్కు బీసీసీఐ అల్టిమేటం!
-
Gold Recycle: మీ ఇంట్లో పాత బంగారం ఉందా? ఈ ఒక్క ట్రిక్తో మన జీవితాలే మారిపోవచ్చు!
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!