KomatiReddy Venkat Reddy: ఏదో జరిగినట్లు.. అల్లు అర్జున్ను పెద్ద హీరోలు పరామర్శించడం విడ్డూరంగా ఉంది!
- రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం
- కనీసం పరామర్శించకపోవడం దారుణం
- అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి
పోలీసులు వద్దన్నా సినీ హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్కు వెళ్లాడని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణం అయ్యాడన్నారు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదని, ఘటన జరిగిన తర్వాత కనీసం పరామర్శించకపోవడం దారుణం అని పేర్కొన్నారు. ఏదో జరిగినట్లు అల్లు అర్జున్ను పెద్దపెద్ద హీరోలు పరామర్శించడం విడ్డూరంగా ఉందని, చట్టం ముందు అందరూ సమానులే అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
శనివారం అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ… ‘పోలీసులు వద్దన్నా అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వెళ్లాడు. థియేటర్వద్ద తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమయ్యాడు. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం మామూలు విషయం కాదు. ఘటన జరిగిన తర్వాత కనీసం పరామర్శించకపోవడం దారుణం. ఏదో జరిగినట్లు అల్లు అర్జున్ను పెద్దపెద్ద హీరోలు పరామర్శించడం విడ్డూరంగా ఉంది. చట్టం ముందు అందరూ సమానులే. స్టార్లకు ప్రత్యేక మినహాయింపులు ఉండవు. అరెస్టు కోసం ఇంటికి వెళ్లిన పోలీసుల పట్ల అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించాడు. పోలీసులు సహనంతో వ్యవహరించారు’ అని అన్నారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
‘ఏసీపీ, డీసీపీ చెప్పిన తర్వాతనే థియేటర్ నుండి అల్లు అర్జున్ బయటకి వెళ్ళాడు. ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదు. సభా నాయకుడు, సీఎంకు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటనను ఎదిరించడం తప్పు. మేం సినీ నటులను గౌరవిస్తాం. మంచి సినిమాలు తీస్తే ప్రోత్సహిస్తాం. సినీ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవు’ అని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో