Site icon NTV Telugu

Minister Karumuri: గెలిచే సత్తా లేక తప్పుడు కూతలు కూస్తున్నారు

Karumuri

Karumuri

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సన్మాన సభలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యాదవులకు చట్ట సభల్లో అత్యధిక స్థానాలు ఇచ్చింది వైసీపీనేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా ఓటర్లు యాదవులే ఉన్నారని ఆయన తెలిపారు. యాధవులను గౌరవించింది జగన్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. కష్టాల్లో తమ వెంట ఉంటా, అందరివాడిగా ఉంటానని ఈ సందర్భంగా తెలియజేశారు.

Saindhav : భారీ క్లైమాక్స్ పార్ట్ పూర్తి చేసిన చిత్ర యూనిట్..

గెలిచే సత్తా లేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తప్పుడు కూతలు కూస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. గత ఎన్నికల్లో టీడీపీ 23, జనసేన ఒకటి గెలుచుకున్నారని.. ఈసారి ఒకటి కూడా గెలవలేరని మంత్రి తెలిపారు. పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని.. చంద్రబాబు, పవన్ లకు ప్రజలే బుద్ది చెప్పుతారని మంత్రి కారుమూరి అన్నారు. మరోవైపు వాలంటీర్లను దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చడం పవన్ అవివేకం అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.

Exit mobile version