NTV Telugu Site icon

Botsa Satyanarayana: వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి గౌరవం పెరిగింది‌‌..

Botsa

Botsa

Botsa Satyanarayana: వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి గౌరవం పెరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లక్కీ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో బొబ్బిలి నియోజకవర్గ గడపగడపకు ముగింపు కార్యక్రమ బహిరంగ సభకు మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమానికి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరయ్యారు.

Read Also: Allagadda: చీపురుపట్టిన మున్సిపల్‌ కమిషనర్‌.. అడ్డుకున్న పారిశుద్ధ్య కార్మికులు

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..” ఈ నాలుగేళ్లలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ఇంటింటికి వెళ్లి వివరించాం. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే వాటిని పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు‌‌. ఆంధ్రప్రదేశ్ పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి… అభివృద్ధి చేసేది జగనే అని అన్నారు. అంగన్వాడీలో సమస్యలు సుమారు 90 శాతం సమస్యలను పరిష్కరించాం. ఒకటో రెండు సమస్యలు ఉన్నాయని కూడా త్వరగా పరిష్కరిస్తాం.” అని మంత్రి హామీ ఇచ్చారు.