Botsa Satyanaryana: రాష్ట్రం కలిసిపోయే పరిస్థితి వస్తే.. మోస్ట్ వెల్ కమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ళ క్రితం జరిగిపోయిన ఏపీ విభజన, తెలంగాణ ఏర్పాటుపై ఆయన మాట్లాడారు. విభజన చట్టం హామీల అమలు కోసం మేం పోరాటం చేస్తూనే ఉంటాం అన్నారు. ఒకవేళ ఏపీ, తెలంగాణ కలిసిపోయే పరిస్థితి వస్తే మోస్ట్ వెల్ కం అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసే ప్రతిపాదన వస్తే తప్పేం ఉంది? అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలనే మేం కోరుకుంటాం అన్నారు. విభజన చట్టం ప్రకారం, హక్కుల సాధన కోసం మేం పోరాటం చేస్తూనే ఉంటాం అన్నారు.
గత ప్రభుత్వం ఏ విషయంలోనూ ప్రజలకు అండగా నిలవలేదని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయాడన్నారు. చంద్రబాబు మాటలు తప్ప చేతలు లేవన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పారదర్శకమైన పాలన అందిస్తున్నారని, వైయస్ఆర్ సీపీ ప్రభుత్వ పాలనలో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పారు. అవినీతికి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సంక్షేమ సాయం జమ చేస్తున్నామని చెప్పారు. బీసీ సభ సాక్షిగా ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని సీఎం వైయస్ జగన్ వివరించారన్నారు. జయహో బీసీ మహాసభ సక్సెస్ కావడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడన్నారు. బీసీల సభ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.
Also Read
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
- EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
Read Also: Gujarat Assembly Polls Results: కాంగ్రెస్కు మరోదెబ్బ.. గుజరాత్లో ప్రతిపక్ష హోదా కూడా కష్టమే..
ఎవరి గురించి అయినా చులకన భావంతో మాట్లాడటం సరికాదని, చంద్రబాబు మైండ్సెట్ మార్చుకోవాలని సూచించారు. అమరావతి అక్రమాలలో ఏ డీఎన్ఏ ఉంది…? పేదల భూములు దోచుకోవడంలో ఏ డీఎన్ఏ ఉంది..? ఇప్పుడు బీసీలు టీడీపీ డీఎన్ఏ అని ఎలా అంటారు..? అని ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది.. రెండు రాష్ట్రాలు కలిసే పరిస్థితి వస్తే స్వాగతిస్తాం. ఉమ్మడి రాష్ట్రంగా కలిసిపోవాలనుకుంటే మోస్ట్ వెల్కం.. అందుకు మేము ఎప్పుడైనా సిద్ధమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Read Also:Cyclone Mandous: మాండస్ తుఫాన్ ఎఫెక్ట్.. తమిళనాడు, ఏపీలో అతిభారీ వర్షాలు!
తాజావార్తలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
-
RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!