Middle East War Escalates: మిడిల్ ఈస్ట్లో యుద్ధం హీట్ కొనసాగుతోంది. ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతు ఇచ్చే దేశాల ప్రజలే టార్గెట్గా బాంబుల వర్షం కురిపిస్తోంది.. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్లోని ఇరానేతరుల నివాసాలే టార్గెట్గా ఇరాన్ దాడి చేస్తోంది.. హైరైజ్డ్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఖాళీ చేసి జనాలు వెళ్లిపోతున్నారు. మరోవైపు.. సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్లు విరుచుకుపడ్డాయి.. అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ లక్ష్యంగా డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి.. తస్ తనోరాలోని ఆరామ్ కో ఆయిల్ రిఫైనరీపై దాడులు జరుగుతున్నాయి.. ఖతార్ రాజధాని దోహాలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ టార్గెట్ మార్చడంతో భారతీయులపై ఎఫెక్ట్ పడింది. 8 UAE దేశాల్లో సుమారు కోటి మందికి పైగా ప్రవాస భారతీయులు ఉన్నారు.. ఎప్పుడేం జరుగుతుందనే భయంలో ప్రవాస భారతీయులు కంగారు పడుతున్నారు.. ఖతార్, దుబాయ్, కువైట్, అబుదాబిలో క్షణ క్షణం భయంగా బతుకుతున్నారు.. వేల మంది ప్రయాణికులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు.
READ MORE: క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!