విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన బాలీవుడ్ సౌత్ ఇండియన్ సినిమా ‘మెర్రీ క్రిస్మస్’.ఈ మూవీ జనవరి 12న థియేటర్లలో రిలీజైంది.మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ మూవీకి అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో విజయ్ సేతుపతి, కత్రినాకైఫ్ యాక్టింగ్తో పాటు శ్రీరామ్ రాఘవన్ టేకింగ్, విజువల్స్ మరియు బ్యాక్డ్రాప్పై ప్రశంసలు వచ్చాయి. కానీ సింపుల్ స్టోరీలైన్ కారణంగా కమర్షియల్ ఫెయిల్యూర్గా ఈ మూవీ నిలిచింది.శ్రీరామ్ రాఘవన్ మూవీస్కు ఉన్న క్రేజ్ కారణంగా ఈ మూవీ ఓటీటీ బిజినెస్ మాత్రం భారీ స్థాయిలో జరిగినట్లు సమాచారం. దాదాపు అరవై కోట్లకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నది. యాభై కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ డిజిటల్ రైట్స్తోనే లాభాల్లోకి అడుగుపెట్టినట్లు సమాచారం.
సంక్రాంతి పోటీ కారణంగా థియేటర్లలో అనుకున్న స్థాయిలో ఈ మూవీ వసూళ్లను రాబట్టలేకపోయింది.ఈ మూవీ కేవలం 20 కోట్లలోపే వసూళ్లను దక్కించుకున్నది. ఫ్రెంచ్ నవల బర్డ్ ఇన్ ఏ కేజ్ ఆధారంగా దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ మెర్రీ క్రిస్మస్ మూవీని తెరకెక్కించాడు. డైరెక్టర్గా శ్రీరామ్ రాఘవన్ కెరీర్లో అత్యధిక ఐఎమ్డీబీ ర్యాంక్ను దక్కించుకున్న మూవీగా మెర్రీ క్రిస్మస్ నిలిచింది. థియేటర్లలో ఈ మూవీ హిందీతో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో రిలీజైంది. కానీ సంక్రాంతి పోటీ కారణంగా ఈ మూవీ రిలీజ్ అయిందనే విషయం తెలియకుండానే థియేటర్లలో నుంచి కనుమరుగైంది. మెర్రీ క్రిస్మస్ మూవీలో రాధికా ఆప్టే మరియు రాధికా శరత్ కుమార్ అతిథి పాత్రలను పోషించారు.ఇదిలా ఉంటే మెర్రీ క్రిస్మస్ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ బాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్న నెట్ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ లో మార్చి 8న మెర్రీ క్రిస్మస్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ హిందీతో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.త్వరలోనే దీనికి సంబంధించి నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం.