NTV Telugu Site icon

Memantha Siddham Bus Yatra: 19వ రోజుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేటి షెడ్యూల్ ఇదే..

Jagan

Jagan

Memantha Siddham Bus Yatra: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 19వ రోజుకు చేరుకుంది. విజయవాడలో తనపై రాయి దాడి జరిగినా.. నుదిటిపై గాయం మానకపోయినా.. బస్సుయాత్రను ముందుకు సాగిస్తున్నారు ఏపీ సీఎం.. ఇక, 19వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా.. ఇవాళ ఉదయం 9 గంటలకు గోడిచర్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మధ్యాహ్నం వరకు నక్కపల్లి, పులవర్తి, యలమంచిలి బైపాస్‌ మీదుగా అచ్యుతాపురం చేరనుంది. భోజన విరామం తర్వాత నరిసింగపల్లి మీదుగా చింతలపాలెంకు బస్సుయాత్ర చేరనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు చింతలపాలెం దగ్గర సీఎం జగన్‌ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. తర్వాత బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్ అస్కపల్లి మీదుగా చిన్నయపాలెం వరకు బస్సుయాత్ర కొనసాగనుంది. రాత్రి చిన్నయపాలెంలో రాత్రి బస శిబిరానికి చేరుకోనున్నారు సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.

Read Also: Chandrababu: ఏపీని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిదే..!

బస్సు యాత్రలు, రోడ్‌షోలు, ముఖాముఖిలు నిర్వహిస్తూనే.. బస్సు యాత్రలో భాగంగా వైసీపీ భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోన్న విషయం విదితమే.. సీఎం జగన్‌పై రాయి దాడి తర్వాత పోలీసులు మరింత భద్రత కల్పిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డులో సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. కాగా, ఎన్నికల ప్రచారంలో ఇడుపులపాయలో మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్‌.. ఇచ్చాపురం వరకు చేరుకోనున్న విషయం విదితమే.