Site icon NTV Telugu

Mekapati Chandrashekar : వైసీపీ నేతల సవాల్‌కు మేకపాటి కౌంటర్

Mekapati

Mekapati

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని వర్గంలో ప్రజలు తిరగ బొనివ్వ మని కొందరు వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. దీంతో చంద్ర శేఖర్ రెడ్డి ఉదయగిరిలోని బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని కూర్చుని ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. తాను ఉదయగిరి కి వచ్చానని ఎవరు వస్తారో రమ్మని సవాల్ చేశారు. ఉదయగిరిలో అభివృద్ధి కార్యక్రమాలు తానే చేశానని ఆయన స్పష్టం చేశారు. ఉదయగిరిలో తానే గెలుస్తానని ఈ విషయం పలుమార్లు స్పష్టమైందన్నారు. తనపై వ్యాఖ్యలు చేసిన నేతలు దమ్ముంటే రావాలని స్పష్టం చేశారు. దీంతో ఉదయగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని చంద్రశేఖర్ రెడ్డిని కార్యాలయానికి వెళ్లాలని సూచించడంతో ఆయన కార్యాలయానికి వెళ్లారు.

Also Read : Monalisa: ఆ ఫ్రంట్ ఏంటి .. ఆ బ్యాక్ ఏంటి.. కుర్రాళ్ళు చచ్చిపోతారు తెలుసా

ఇటీవల వైసీపీ నుంచి మేకపాటిని సస్పెన్షన్ చేయడంతో స్ధానికంగా పలువురు వైసీపీ నేతలు వరుసగా ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. దీంతో కొంతకాలంగా బెంగళూరులో ఉంటున్న మేకపాటి.. నిన్న ఉదయగిరికి వచ్చారు.. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరి కి రానివ్వమని, ఇక్కడి నుంచి తరుముతామన్న పలువురు నేతల ఛాలెంజ్ ను ఆయన స్వీకరించారు. ఉదయగిరి బస్టాండ్ వద్దకు వచ్చి గంటసేపు కుర్చీ వేసుకుని కూర్చున్నారు. దమ్ముంటే ఇక్కడికి వచ్చి దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని సవాల్ చేశారు మేకపాటి.

Also Read : Helicopters Crash: బ్లాక్ హాక్ హెలికాప్టర్లు క్రాష్.. 9 మంది యూఎస్ సైనికులు మృతి

Exit mobile version