Site icon NTV Telugu

CM Chandrababu: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శుల సమావేశం.. కీలక అంశాలపై చర్చ

Cm Chandrababu

Cm Chandrababu

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరుగనుంది. సచివాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ ఈ సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. జీఎస్డీపీ వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల్లో భాగంగా పది సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ పై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. వీటితో పాటు రాష్ట్రంలోకి వచ్చిన వివిధ పెట్టుబడులు, ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన పీపీపీ ప్రాజెక్టుల పురోగతి అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది.

Also Read:Tragedy: కూకట్‌పల్లిలో విషాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌పై పడిన పతంగి తీస్తూ బాలుడు విద్యుత్ షాక్‌

రియల్ టైమ్ గవర్నెన్సు లో భాగంగా అవేర్, డేటా లేక్ సహా పాలనలో ఏఐ టూల్స్ ఇతర సాంకేతికత వినియోగంపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ విధానం అమలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సహా రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో శాఖలు తీసుకోవాల్సిన కార్యాచరణ, చేరుకోవాల్సిన లక్ష్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Exit mobile version