Meerpet Murder Case : మీర్‌ పేట్‌ మర్డర్ కేస్.. గురుమూర్తికి 14 రోజుల రిమాండ్

  • మీర్‌ పేట్‌ మర్డర్ కేసు కీలక అప్డేట్‌
  • గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
  • ఫిబ్రవరి 11వ తేదీ వరకు గురుమూర్తికి రిమాండ్
Meerpet Murder Case

Meerpet Murder Case

Meerpet Murder Case : తెలంగాణను కుదిపేసిన మీర్‌పేట్ హత్య కేసును పోలీసులు పరిష్కరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పలు కీలక విషయాలను వెల్లడించారు. సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ, భార్య వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేసినప్పటికీ, నిందితుడు గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని అన్నారు. కేసు దర్యాప్తు లోతుగా సాగుతుండగా, బయటకు వస్తున్న విషయాలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని ఆయన పేర్కొన్నారు.

CBSE Recruitment 2025: ఇంటర్, డిగ్రీ పాసయ్యారా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీకోసమే

ఇంతగా పగ పెంచుకుని, ఏ మాత్రం చలించకుండా ఎవరికైనా ఇలా చేసేందుకు ఎలా మనసొచ్చిందో అర్థంకావడం లేదు అని సుధీర్‌బాబు విచారం వ్యక్తం చేశారు. అయితే… తాజాగా మాధవిని హత్య చేసిన ఆమె భర్త గురుమూర్తిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పరిశీలించిన కోర్టు నిందితుడు గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఫిబ్రవరి 11వ తేదీ వరకు గురుమూర్తికి రిమాండ్ విధించింది రంగారెడ్డి కోర్టు. అయితే.. ఈ నేపథ్యంలో గురుమూర్తిని చర్లపల్లి జైలుకు తరలించారు మీర్‌పేట్‌ పోలీసులు. అయితే.. నాకు బెయిల్ వద్దు, న్యాయవాదులు వద్దు అంటూ కోర్టు బయటకు వచ్చిన నిందితుడు గురుమూర్తి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Minister Kolusu Parthasarathy: వైసీపీ ఖాళీ అవుతోంది.. నంబర్‌ 2లు కూడా వెళ్లిపోయారు.