Meenakshi Natarajan : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆంతర్యాన్నిపరిపాలించేందుకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తిరిగి దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముఖ్య నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. హైదర్గూడలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఆమె లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గాల నాయకులతో సమావేశమయ్యారు.
Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు..
మొదట ఆదిలాబాద్ నియోజకవర్గంపై చర్చించి, అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలతో భేటీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అలాగే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో కూడా ఆమె విడివిడిగా సమావేశం కానున్నారు. కేబినెట్లో స్థానం కోరుతున్న నేతల ఒత్తిడిని పరిగణనలోకి తీసుకుని, పార్టీలో అనవసర ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకు మీనాక్షి నటరాజన్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు ఐఎండీ హెచ్చరికలు..
