Site icon NTV Telugu

Road Accident: రెండు కార్లు ఢీ.. ముగ్గురు అక్కడికక్కడే మృతి!

Road Accident

Road Accident

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేటు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షగాత్రులను చికిత్స నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కారులో 9 మంది ప్రయాణిస్తున్నారు. మృతులు అలీ (45), అజీం బేగం (40), ఎండీ గౌస్‌ (1)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు చిత్తూరు జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. రామకుప్పం మండలం జల్ది గాని పల్లె సమీపంలో చెట్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆరుగురుకి గాయాలు అయ్యాయి. గాయపడిన వారికి స్దానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణం‌‌ అని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version