Measles Cases: ముంబైలో విజృంభిస్తున్న మీజిల్స్.. నెలలో 13 మంది మృతి
Measles Cases: దేశ ఆర్థిక రాజధాని ముంబై లో మీజిల్స్ వ్యాధి విజృంభిస్తోంది. చిన్నారులకు సోకే ఈ అంటువ్యాధి పసిపిల్లల ప్రాణాలు బలిగొంటుంది. ఈ వ్యాధి కారణంగా ఇటీవల ఎనిమిదినెలల చిన్నారి చనిపోయింది. దీంతో నెల రోజుల్లో మీజిల్స్ కారణంగా 13 మంది చిన్నారులు మరణించినట్లు అధికారులు తెలిపారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ అప్రమత్తమైంది. బీహార్, గుజరాత్, హరియాణా, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ముంబైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో మీజిల్స్ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 233 మీజిల్స్ కేసులు నమోదు కాగా, గడిచిన రెండు నెలల్లోనే 200 కేసులు నమోదయ్యాయి. గత కొన్నేళ్లలో ఈ స్థాయి కేసులు ఎప్పుడూ నమోదు కాలేదు. బుధవారం 30 మంది చిన్నారులు మీజిల్స్ వ్యాధితో ఆస్పత్రిలో చేరగా, 22 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Read Also: Russia – Ukraine War : రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించిన ఈయూ పార్లమెంట్
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
ముంబైతోపాటు సమీపంలోని మాలేగావ్, భివండి, థానే, నాసిక్, అకోలా, కల్యాణ్ తదితర ప్రాంతాల్లో కేసులు ఎక్కువ వస్తున్నాయి. ముంబైతోపాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాల్లో కూడా మీజిల్స్ కేసులు ప్రబలుతున్నాయి. రాంచీ, అహ్మదాబాద్, మలప్పురంలలో పిల్లలలో మీజిల్స్ కేసుల సంఖ్య పెరుగుదలను అంచనా వేయడానికి.. నివారణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి బృందాలను నియమించింది. కోవిడ్ వల్ల వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించలేదని, దీంతో మీజిల్స్ వ్యాధి పెరుగుతోందంటున్నారు. చిన్నపిల్లల్లో సోకే ఈ వ్యాధిని నియంత్రించడానికి రెండు డోసుల వ్యాక్సిన్ వేస్తుంటారు. 9-15 నెలల మధ్య వయసున్న చిన్నారులకు రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ముంబై పరిధిలో అర్హత కలిగిన వారిలో 41 శాతం మంది చిన్నారులు మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారని అధికారులు చెప్పారు. కనీసం 20వేల మందికిపైగా చిన్నారులు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉందన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!