Site icon NTV Telugu

Attack on US consulate in Karachi: ఇరాన్ సుప్రీం లీడర్ మరణం.. కరాచీలోని అమెరికా కాన్సులేట్ పై దాడి

Pak Us Consulate

Pak Us Consulate

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన వార్త వ్యాప్తి చెందిన తర్వాత, పాకిస్తాన్‌లోని కరాచీలో అమెరికా కాన్సులేట్ జనరల్‌పై భారీ నిరసనలు, దాడులు జరిగాయి. షియా సంఘాలు, ఇతర ముస్లిం సమూహాలు ఆగ్రహంతో రోడ్లపైకి దిగాయి. నిరసనకారులు అమెరికా కాన్సులేట్ వద్ద కు చేరుకుని రాళ్లు రువ్వుతూ దాడికి పాల్పడ్డారు. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వార్నింగ్ షాట్స్ ప్రయోగించి జనాన్ని చెదరగొట్టారు. ఈ ఘర్షణల్లో కనీసం 5 మంది గాయపడ్డారు, కొందరు తీవ్రంగా గాయపడ్డారని రెస్క్యూ అధికారులు తెలిపారు.

Also Read:Sandeepa Virk :తీహార్ జైల్లో నరకం చూశాను.. గుర్తొస్తే ఇప్పటికీ భయం వేస్తుంది

పోలీస్ ఫైరింగ్‌లో కాజువాల్టీలు ఉన్నాయని కొన్ని సోర్సెస్ చెబుతున్నాయి. ఈ దాడి ఖమేనీ మరణానికి ప్రత్యక్ష ప్రతిస్పందనగా జరిగింది. ఇరాన్‌పై జరిగిన దాడులకు అమెరికాను బాధ్యుడిగా చూస్తున్న షియా సమాజం, పాకిస్తాన్‌లోని భావోద్వేగాలను ప్రతిబింబిస్తోంది. కరాచీలోని ఎంటీ ఖాన్ రోడ్, నుమాయిష్ ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రోడ్లు సీల్ చేశారు, ప్రజలను ఆ ప్రాంతం నుంచి దూరంగా ఉండమని అధికారులు హెచ్చరించారు. అమెరికా కాన్సులేట్ జనరల్ కరాచీ భద్రతా అలర్ట్ జారీ చేసింది.

Also Read:Ayatollah Ali Khamenei: ఖమేనీ.. ట్రంప్, నెతన్యాహు కంటే ధనవంతుడా? ఆయన ఎంత కర్సెన్సీని వదిలి వెళ్లాడో తెలుసా!

ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు అమెరికా సిబ్బంది కదలికలు పరిమితం చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన మధ్యప్రాచ్యం, దక్షిణాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ నిరసనలు శాంతియుతంగా మొదలైనప్పటికీ, కొందరు నిరసనకారులు హింసాత్మకంగా మారారు. పాకిస్తాన్ ప్రభుత్వం పరిస్థితిని నియంత్రణలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఘటన ట్రంప్ ప్రభుత్వం పాకిస్తాన్‌తో ఉన్న సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చు.

Exit mobile version