Protest : మాగోడు వినేవారే లేరా.. అమరవీరుల కుటుంబ సభ్యుల వేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల గ్రేహౌండ్స్ పోలీసులకు నగరశివారులో భూమిని కేటాయించారు.. బాధితులు ఆ స్థలంలో నిర్మాణాలు చేస్తుండగా అటవీశాఖ అధికారులు వారిపై దాడులు చేసి వారిని బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది.. 2008 జూన్ లో ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దులో నక్సలైట్ల మెరుపు దాడిలో మరణించిన గ్రేహౌండ్ 33 పోలీసుల కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం కుత్బుల్లాపూర్ గాజులరామారం సర్వే నెంబరు 16 లో 3.10 ఎకరాల భూమిని కేటాయించారు.. 2014 సెప్టెంబరు 30 న అప్పటి ఎపి, తెలంగాణ డీజీపీలు జె.వి. రాముడు, అనురాగం శర్మ లు భూమి పూజ చేసారు. ఈ స్థలం అటవీ శాఖ, ప్రయివేట్ సర్వే నెంబర్లు ప్రక్క ప్రక్కనే ఉండడంతో హద్దులు చేయకుండా వదిలేసారు..తెలంగాణా ప్రభుత్వం వారికి ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని ప్రతిపాదించారు.. కాని ఆదర్శంగా అడుగులు పడలేదు.
Also Read : Meenakshi Chaudhary: హిట్ 2 భామ క్లివేజ్ షో తో హీటెక్కిస్తోందే
దీంతో బాధితులు అసోషియేషన్ ఏర్పాటు చేసుకొని ఇల్లు నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తుండగా అటవీ శాఖ అధికారులు ఈ భూమి తమ పరిధిలోకి వస్తుందని నిర్మాణాలను పడగొట్టి వారిపై దాడి చేసి జీపులో తీసుకెళ్లారని బాధితులు వాపోతున్నారు.. మాకు పట్టాలు ఇచ్చి లేఅవుట్ చేసిన స్థలం మాదంటూ, అటవీశాఖ అధికారులు ఇలా ప్రవర్తించడం అమానుషం అంటూ, తమకు న్యాయం చేయాలని తెలంగాణా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కేటాయించిన స్థలంలో ధర్నా చేస్తున్న బాధితులు.. తమ పిల్లలను పోగొట్టుకొన్న తమకు ఆసరాగా ప్రభుత్వం కేటాయించిన తమ స్థలంలో నిర్మాణాలకు ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Vizag Steel Plant Blast: స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై నివేదిక.. ఏడుగురు సీనియర్ అధికారులపై వేటు..
- CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
తాజావార్తలు
-
Japan Releases : జపాన్ మార్కెట్ టార్గెట్ చేస్తోన్న భారతీయ చిత్రాలు
-
Motorola Edge 70 Max: మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ మ్యాక్స్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా, Snapdragon 8 Gen 5 చిప్
-
Vaibhav Sooryavanshi Debut: వైభవ్ అరంగేట్రాన్ని టీమిండియా ఎందుకు అడ్డుకుంటోంది?.. అసలు కారణం ఇదే!
-
Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
-
Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!