NTV Telugu Site icon

Mark Zuckerberg: జుకర్‌బర్గ్‌కు భారీ స్థాయిలో భద్రత పెంపు..అందుకేనా!

15

15

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ ట్రెండ్ నడుస్తోంది. ఉద్యోగాల కోత పేరుతో ఉద్యోగులను తొలగిస్తూ ఖర్చులు తగ్గించుకుంటున్న వేళ ఫేస్‌బుక్‌ యాజమాన్య సంస్థ మెటా అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఫేస్‌బుక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, సహ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ అలవెన్స్‌ను భారీగా పెంచింది. జుకర్‌బర్గ్‌కు, ఆయన కుటుంబానికి ఇస్తున్న సెక్యూరిటీ అలవెన్సును ఏకంగా 4 మిలియన్‌ డాలర్లు పెంచి 14 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.115 కోట్లు) చేసింది. ప్రస్తుతం పెంచిన సెక్యూరిటీ అలవెన్సుతోపాటు జుకర్‌బర్గ్‌కు సెక్యూరిటీ ప్రోగ్రామ్ కింద చెల్లిస్తున్న ఖర్చులన్నీ దక్కనున్నాయి. అయితే. ఓ వైపు ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వేలాది ఉద్యోగాలకు కోత పెడుతూ మరోవైపు జుకర్‌బర్గ్‌కు ఇంత భారీగా సెక్యూరిటీ అలవెన్స్‌ను పెంచడం చర్చనీయాంశమైంది.

Also Read: James Anderson: అండర్సన్‌ హిస్టరీ.. 21 ఏళ్లుగా వికెట్ల వేటలో!

ఫోర్బ్స్ బిలియనీర్ జాబితాలో అత్యంత సంపన్న వ్యక్తిగా 16వ ర్యాంక్‌లో ఉన్న జుకర్‌బర్గ్‌ 2021లో సుమారు 27 మిలియన్ల డాలర్ల జీతభత్యాలను అందుకున్నాడు. అయితే గత సంవత్సరానికి సంబంధించి అతని పే ప్యాకేజీని మెటా ఇంకా వెల్లడించలేదు. మెటా మరిన్ని ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతున్నందునే ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బడ్జెట్‌లను ఖరారు చేయడంలో ఆలస్యం చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇందుకోసమే జుకర్‌బర్గ్ సెక్యూరిటీని పెంచినట్లు సమాచారం.

Also Read: Bollywood: సూపర్ మాన్ Vs బాట్ మాన్; ఐరన్ మాన్ Vs కెప్టెన్ అమెరిక; టైగర్ Vs పఠాన్