Manish Sisodia: నా భార్యను కలవాలని ఉంది.. కోర్టులో పిటిషన్ వేసిన ఢిల్లీ మాజీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కలవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం రోస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో కలవాలని సిసోడియా పిటిషన్లో కోరారు. అంతకుముందు జూన్ నెలలో, ఢిల్లీ హైకోర్టు సిసోడియా తన భార్యను మధుర రోడ్లోని తన అధికారిక నివాసంలో ఒక రోజు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు కలిసేందుకు అనుమతించింది. అప్పటి నుంచి సిసోడియా తన భార్యను కలవలేదు.
నవంబర్ 22 వరకు కస్టడీ పొడిగింపు
వాస్తవానికి అక్టోబర్లో మనీష్ సిసోడియాను ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని నవంబర్ 22 వరకు పొడిగించింది. బెయిల్ పిటిషన్ను రూస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో మనీష్ సిసోడియా కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. దీనిపై గత రెండు నెలలుగా విచారణ కొనసాగుతోంది. అయితే సిసోడియా బెయిల్ పిటిషన్ను ఈడీ, సీబీఐలు కూడా సుప్రీంకోర్టులో పలు వాదనలతో వ్యతిరేకించాయి.
Also Read
- Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
Read Also:Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీఐపీ, సిఫార్స్ లేఖల్ని స్వీకరించరు
AAPకి షాక్
ఈడీ వాదనలు విన్న తర్వాత మొత్తం స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీ లాభపడి ఉంటే.. ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు నిందితుడిగా చేర్చలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా నిందితుడిగా మార్చాలని ఈడీ పరిశీలిస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చినట్లయితే, అది పార్టీ నాయకత్వం, సంస్థ రెండింటిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
చాలా మంది నిందితులకు బెయిల్
మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేయగా, ఆ తర్వాత మార్చి 9న తీహార్ జైలు నుంచి ఈడీ అరెస్ట్ చేయడం గమనార్హం. అప్పటి నుంచి మనీష్ సిసోడియా రెండు కేసుల్లో తీహార్ జైలులో ఉన్నారు. ఈ సమయంలో ఆయన బెయిల్ కోసం కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు పిటిషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఇప్పటివరకు చాలా మంది నిందితులకు బెయిల్ మంజూరైంది. అయితే మనీష్ సిసోడియాకు ఇంకా బెయిల్ రాలేదు.
Read Also:Telangana BJP: నామినేషన్లకు నేడే ఆఖరు రోజు.. ఇంకా అభ్యర్థులను ప్రకటించని బీజేపీ
తాజావార్తలు
-
Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్పై క్రేజీ అప్డేట్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!