Manish Sisodia: నా భార్యను కలవాలని ఉంది.. కోర్టులో పిటిషన్ వేసిన ఢిల్లీ మాజీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కలవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం రోస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో కలవాలని సిసోడియా పిటిషన్లో కోరారు. అంతకుముందు జూన్ నెలలో, ఢిల్లీ హైకోర్టు సిసోడియా తన భార్యను మధుర రోడ్లోని తన అధికారిక నివాసంలో ఒక రోజు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు కలిసేందుకు అనుమతించింది. అప్పటి నుంచి సిసోడియా తన భార్యను కలవలేదు.
నవంబర్ 22 వరకు కస్టడీ పొడిగింపు
వాస్తవానికి అక్టోబర్లో మనీష్ సిసోడియాను ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని నవంబర్ 22 వరకు పొడిగించింది. బెయిల్ పిటిషన్ను రూస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో మనీష్ సిసోడియా కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. దీనిపై గత రెండు నెలలుగా విచారణ కొనసాగుతోంది. అయితే సిసోడియా బెయిల్ పిటిషన్ను ఈడీ, సీబీఐలు కూడా సుప్రీంకోర్టులో పలు వాదనలతో వ్యతిరేకించాయి.
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
Read Also:Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీఐపీ, సిఫార్స్ లేఖల్ని స్వీకరించరు
AAPకి షాక్
ఈడీ వాదనలు విన్న తర్వాత మొత్తం స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీ లాభపడి ఉంటే.. ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు నిందితుడిగా చేర్చలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా నిందితుడిగా మార్చాలని ఈడీ పరిశీలిస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చినట్లయితే, అది పార్టీ నాయకత్వం, సంస్థ రెండింటిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
చాలా మంది నిందితులకు బెయిల్
మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేయగా, ఆ తర్వాత మార్చి 9న తీహార్ జైలు నుంచి ఈడీ అరెస్ట్ చేయడం గమనార్హం. అప్పటి నుంచి మనీష్ సిసోడియా రెండు కేసుల్లో తీహార్ జైలులో ఉన్నారు. ఈ సమయంలో ఆయన బెయిల్ కోసం కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు పిటిషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఇప్పటివరకు చాలా మంది నిందితులకు బెయిల్ మంజూరైంది. అయితే మనీష్ సిసోడియాకు ఇంకా బెయిల్ రాలేదు.
Read Also:Telangana BJP: నామినేషన్లకు నేడే ఆఖరు రోజు.. ఇంకా అభ్యర్థులను ప్రకటించని బీజేపీ
తాజావార్తలు
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
-
Karuppu Controversy:ఇళయరాజాకు ‘కరుప్పు’ టీమ్ క్షమాపణ.. వైరల్ అవుతున్న ప్రెస్ నోట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!