Manish Sisodia: నా భార్యను కలవాలని ఉంది.. కోర్టులో పిటిషన్ వేసిన ఢిల్లీ మాజీ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను కలవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం రోస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో కలవాలని సిసోడియా పిటిషన్లో కోరారు. అంతకుముందు జూన్ నెలలో, ఢిల్లీ హైకోర్టు సిసోడియా తన భార్యను మధుర రోడ్లోని తన అధికారిక నివాసంలో ఒక రోజు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు కలిసేందుకు అనుమతించింది. అప్పటి నుంచి సిసోడియా తన భార్యను కలవలేదు.
నవంబర్ 22 వరకు కస్టడీ పొడిగింపు
వాస్తవానికి అక్టోబర్లో మనీష్ సిసోడియాను ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని నవంబర్ 22 వరకు పొడిగించింది. బెయిల్ పిటిషన్ను రూస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో మనీష్ సిసోడియా కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. దీనిపై గత రెండు నెలలుగా విచారణ కొనసాగుతోంది. అయితే సిసోడియా బెయిల్ పిటిషన్ను ఈడీ, సీబీఐలు కూడా సుప్రీంకోర్టులో పలు వాదనలతో వ్యతిరేకించాయి.
Also Read
- IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
- CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
- Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
- DK Shivakumar: తుంగభద్ర వేదికగా నీటి ఐక్యత సందేశం ఇచ్చిన డీకే శివకుమార్
Read Also:Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. వీఐపీ, సిఫార్స్ లేఖల్ని స్వీకరించరు
AAPకి షాక్
ఈడీ వాదనలు విన్న తర్వాత మొత్తం స్కామ్లో ఆమ్ ఆద్మీ పార్టీ లాభపడి ఉంటే.. ఆమ్ ఆద్మీ పార్టీని ఎందుకు నిందితుడిగా చేర్చలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని కూడా నిందితుడిగా మార్చాలని ఈడీ పరిశీలిస్తోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుడిగా చేర్చినట్లయితే, అది పార్టీ నాయకత్వం, సంస్థ రెండింటిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
చాలా మంది నిందితులకు బెయిల్
మనీష్ సిసోడియాను ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్టు చేయగా, ఆ తర్వాత మార్చి 9న తీహార్ జైలు నుంచి ఈడీ అరెస్ట్ చేయడం గమనార్హం. అప్పటి నుంచి మనీష్ సిసోడియా రెండు కేసుల్లో తీహార్ జైలులో ఉన్నారు. ఈ సమయంలో ఆయన బెయిల్ కోసం కింది కోర్టు నుంచి పై కోర్టు వరకు పిటిషన్ల దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఇప్పటివరకు చాలా మంది నిందితులకు బెయిల్ మంజూరైంది. అయితే మనీష్ సిసోడియాకు ఇంకా బెయిల్ రాలేదు.
Read Also:Telangana BJP: నామినేషన్లకు నేడే ఆఖరు రోజు.. ఇంకా అభ్యర్థులను ప్రకటించని బీజేపీ
తాజావార్తలు
-
SSC Supplementary Results : టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ సారి కూడా అమ్మాయిలే టాప్.!
-
RC 17 : కన్ఫ్యూజన్లో పడేసిన సుకుమార్
-
IND Vs IRL: క్రికెట్ అభిమానులకు అలర్ట్.. ఐర్లాండ్ సిరీస్ సమయాల్లో మార్పులు.. రేపటి మ్యాచ్ సమయం ఇదే..
-
CM Vijay: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన విజయ్.. ఫొటోలు వైరల్
-
Ketan Agarwal Murder: యూట్యూబ్ సెర్చ్, కేఫ్లో మంతనాలు.. కేతన్, సియా కేసులో కీలక ఆధారాలు..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!