Kangana Ranaut : కంగనా రనౌత్ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్.. నోటీసులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut : హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చిక్కుల్లో పడ్డారు. ఆమె ఎన్నికను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సవాలు చేశారు. ఆ తర్వాత కోర్టు కంగనా రనౌత్కి నోటీసు పంపింది. నోటీసు జారీ చేస్తూ, జస్టిస్ జ్యోత్స్నా రేవాల్ ఆగస్టు 21 లోగా కంగనా రనౌత్ నుండి సమాధానం కోరింది. కిన్నౌర్ నివాసి, స్వతంత్ర అభ్యర్థి లైక్ రామ్ నేగి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేసినప్పటికీ తన నామినేషన్ తిరస్కరించబడిందని లైక్ రామ్ నేగి ఈ పిటిషన్ ద్వారా వాదించారు. కంగనాను అనర్హురాలిపై ప్రకటించాలని లాయక్ పిటిషన్లో పేర్కొన్నారు.
Read Also:Weather Warning: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు..
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
దీనిని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. రిటర్నింగ్ అధికారి (డిప్యూటీ కమిషనర్ ఆఫ్ మండి)ని దూషిస్తూనే.. ఈ కేసులో అతన్ని బాధ్యుడిని చేయాలనే డిమాండ్ వచ్చింది. లైర్ రామ్ నేగి అటవీ శాఖ మాజీ ఉద్యోగి. అతను అకాల పదవీ విరమణ తీసుకున్నాడు. ఈయన గతంలో అటవీ శాఖలో పని చేసేశారు. పదవీ విరమణ తరువాత రిటర్నింగ్ అధికారి(మండి డిప్యూటీ కమిషనర్)కి నామినేషన్ పత్రాలతోపాటు డిపార్ట్మెంట్ నుంచి నో డ్యూ సర్టిఫికేట్ కూడా సమర్పించినట్లు చెప్పారు. విద్యుత్, నీరు, టెలిఫోన్ శాఖల నుంచి ‘నో డ్యూ సర్టిఫికేట్’ సమర్పించేందుకు ఒక రోజు గడువు ఇవ్వగా, రిటర్నింగ్ అధికారి వాటిని ఆమోదించలేదని.. పైగా నామినేషన్ పత్రాలను తిరస్కరించారన్నారు. తన నామినేషన్ని స్వీకరించి ఉంటే విజయం సాధించేవాడినని, వివరాలను అన్ని సమర్పించినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయనివ్వలేదని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్పై 74,755 ఓట్ల తేడాతో కంగనా విజయం సాధించారు. సింగ్కు 4,62,267 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి కంగనాకు 5,37,002 ఓట్లు వచ్చాయి. రిటర్నింగ్ అధికారి తన నామినేషన్ పత్రాలను అక్రమంగా తిరస్కరించారని లాయక్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!